హిమాచల్ స్టేట్ మ్యూజియం లేదా సిమ్లా స్టేట్ మ్యూజియం స్కాండల్ పాయింట్ నుండి 3 కి.మీ.ల దూరంలో కలదు. ఈ మ్యూజియంను 1974లో స్థాపించారు. దీనిలో అందమైన పహారీ , మొఘల్, రాజస్థాని పెయింటింగ్ లు కలవు. అనేక రాగి కళాకృతులు , ఫొటోగ్రాఫ్ లు, స్టాంపులు కూడా చూడవచ్చు. టూరిస్టులు ఇక్కడ గుప్తా శిలలు, స్టోన్ ప్రతిమలు, కుళ్ళు మాస్క్ లు చూడవచ్చు. లైబ్రరీ లో వివిధ చారిత్రాత్మక పుస్తకాలు, గ్రంధాలు కూడా కలవు. ఈ మ్యూజియం మంగళ వారం నుండి ఆదివారం వరకు ఉదయం 10 గం. నుండి సా. 5 గం. వరకు తెరచి వుంటుంది. సోమవారాలు సెలవు.