బ్రహ్మపురీస్వరార్ ఆలయ ప్రాంగణంలో ఉన్న సత్తనాథ స్వామి ఆలయం శీర్కాళిలోని ప్రధాన తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. ఈ ఆలయంలో శివుడు భైరవ రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం నుండి అందమైన బ్రహ్మపురీస్వరార్ ఆలయ౦ పూర్తి దృశ్యాన్ని చూడవచ్చు. గంభీరమైన గోపురాలు (టవర్లు) మండపాలు (మందిరాలు) సాధారణ సాంప్రదాయ హిందూ దేవాలయ నిర్మాణ నమూనాలు, శైలులను తెలుపుతుంటాయి. విశాలమైన సభామండపంలో తరుచు భక్తులు గంటల తరబడి ధ్యానం, విశ్రాంతి కోసం కూర్చుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి దూర, దగ్గర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. శీర్కాళిలో ఉన్న అనేక ఇతర ఆలయాలు ప్రజలను, విశ్వాసాలను, ధార్మికతను, దేవుడిని కలుపుతాయి.