మతపరంగా ప్రాముఖ్యత కల్గిన అనేక దేవాలయాలు కల్గిన గ్రామం కర్మల. బర్షి, మంగల్వేద తో కలిపి ఈ మూడు ప్రాంతాలు చారిత్రిక ప్రాధాన్యత కల్గి ఇక్కడ నివసించిన చాల మంది సాధువుల వలన తీర్థ యాత్ర స్థలాలుగా అభివృద్ధి చెందాయి.కర్మలలో దేవాలయ వాస్తు శైలి ఒక విశిష్టత ను కల్గి ఉంటుంది. ఇక్కడి ఒక దేవాలయం 96 సంఖ్యతో ప్రత్యేక రీతిలో కలపబడినది. ఈ నిర్మాణం 96 స్తంభాలను కల్గి 96 చిత్రాలు వీటిపై చిత్రించబడటమే కాక ద్వారం నుండి దేవాలయానికి 96 మెట్లను కల్గిఉంది.కర్మల్ లోనే అనేక ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో కమలా భవాని దేవాలయం ఒకటి. కమల దేవికి చెందిన ఈ దేవాలయాన్ని హేమండ్పతి వాస్తు శైలి ని దృష్టిలో పెట్టుకొని 1727 లో రావు రాజే నిమ్భాల్కర్ కట్టించారు.నవరాత్రి, కార్తిక పూర్ణిమ పండుగ రోజులలో భక్త సమూహం ఈ దేవత ఆశీస్సుల నిమిత్తమై ఇక్కడకు విచ్చేస్తారు.