మంగళ వేద లోని సంత్ దమజి శ్రీ సంత్ దమజి అనే గొప్ప సాధువు పేరిట నిర్మించిన ప్రసిద్ద దేవాలయం. షోలాపూర్ జిల్లాలో పశ్చిమాన 55 కిలోమీటర్లదూరంలో మరొక తీర్థ్ ప్రాంత౦ పంధర్పుర్ నకు 25 కిలోమీటర్ల దూరంలో గల మంగళ వేద నగరంలో ఈ దేవాలయం ఉంది.మంగళ వేద గ్రామాన్ని సాధువుల భూమి అంటారు. సంత్ కన్హో పాత్ర, సంత్ దమజి, సంత్ గోపా బాయి, సంత్ గాడ్గేబాబా వంటి అనేక మంది సాధువులు 14 శతాబ్దం లో ఈ ప్రాంతం నందు నివసించడమే దీనికి కారణం.సిరిసంపదల దేవత లక్ష్మి దేవికి చెందిన లక్ష్మి దహి వాడి దేవాలయ౦ మంగళవేద గ్రామం లో ఉంది. సమృద్ధిగా పాల ఉత్పత్తి వల్ల ఈ గ్రామం ప్రజలు పక్క గ్రామాల వారికీ దహి – పెరుగు ను అమ్మేవారు. ఈ కారణంగా ఈ గ్రామాన్ని లక్ష్మి దహి వాడి గా పిలిచారు.