తుల్జాపూర్ గ్రామంలో గల తీర్థం వలె శ్రీ దాహిగాన్ తీర్థ్ కూడా షోలాపూర్ జిల్లాలో అదే పేరుతో గల గ్రామంలోని ఒక ప్రసిద్ధ జైన తీర్థయాత్ర ప్రాంతం.ఈ ప్రార్ధన మందిరం 244 సెంటిమిటర్ ఎత్తుగల నల్ల రంగు భగవాన్ మహావీరుని విగ్రహాన్ని కల్గి ఉంది. ఈ విగ్రహం పద్మాసనంలో కూర్చున్నట్లుగా ఉంటుంది. 1889 లో విక్రమ శకానికి చెందిన మహాత్తిసాగర్జి మహారాజ్ పవిత్ర పాదముద్రలను ఇక్కడ గమనించవచ్చు.ఈ దేవాలయ గోడలు విశేషమైన అలంకరణతో అందంగా ఉంటాయి. ఇక్కడి గోడలపై దిగంబర ఆచార్యుల వారి ఒక ప్రత్యేకమైన తైల వర్ణచిత్రం తో బాటుగా ఇతర పురాతన చిత్రాలు వేలాడదీశారు. మహత్త సాగర్ జీ భక్తుల కోసంఈ తీర్థంలో ధ్యానం చేస్తుండటంవల్ల వారు తమ బాధలు, శాపాలనుండి విముక్తి పొందగలరని భక్తుల నమ్మకమని ఇతిహాసం తెలుపుతుంది.షోలాపూర్ నుండి బస్సు లేదా రైలు ద్వారా ఈ తీర్థ కేంద్రానికి సులువుగా చేరవచ్చు.