సిద్దేశ్వర దేవాలయం ఒక అందమైన సరస్సు మధ్య ఉండి అన్ని వైపుల నీటితో చుట్టబడి ఉంది. షోలాపూర్ నగరం మొత్తానికి మనోహర దృశ్యాల పర్యాటక ప్రాంతంగా భావి౦చబడుతుంది.ఈ దేవాలయం శ్రీ మల్లికార్జునుని శిష్యునిచే నిర్మించబడినది. శ్రీ మల్లికార్జున శ్రీ శైలం లోని శ్రీ సిద్ధ రామేశ్వర్ కు చెందినవారు. సిద్దేశ్వర విగ్రహం అదే పేరుతో గల పరమశివుని, విష్ణుదేవుని పవిత్ర అవతారాలను తెలియ చేస్తుంది.
ఈ దేవాలయం సిద్దేస్వర్ సరస్సు లో ఉండి లోపలి ప్రాంగణంలో ప్రవేశించడానికి మూడు ద్వారాలను కల్గి ఉంది. లోపల దగ్గరలో మధురమైన పచ్చటి తోట లో నలత్వాడ సాధువు నకు చెందిన చిన్న మందిరం ఉంది. ఈ దేవాలయ ప్రాంగణంలో విఠోబా, రుక్మిణి లతో బాటు మరి కొంత మంది దేవతల చిన్న మందిరాలు ఉన్నాయి.షోలాపూర్ వెళ్ళినప్పుడు కనీసం ఒక్కసారి అయిన ఈ దేవాలయాన్ని దర్శించండి.



Click it and Unblock the Notifications