లడఖ్హి లేదా జోజి దర్రా లకు హిమాలయన్ గేట్వే పరిగణించబడే జోజి - లా పాస్ సొనామార్గ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టం నుండి 3465 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఈ ప్రాంతం ఉంది. లెహ్ మరియు కార్గిల్ మధ్యలో సముద్రపు మట్టం నుండి 4108 మీటర్ల ఎత్తులో ఉన్న ఫోటు లా పాస్ తరువాత అతి పెద్దదైన పాస్ గా జోజి - లా పాస్ ని పేర్కొనవచ్చు.
మంచు పర్వతాలు, కాశ్మీర్ లోయ, డ్రాస్ లోయ అలాగే అడవులతో చుట్టబడిన ఈ జోజి - లా పాస్ కాశ్మీర్ లో నే అతి ప్రమాదకరమైన పాస్ గా పరిగణించబడినది. అంతేకాకుండా, లోయలో అత్యంత ప్రమాదకరమైన పాస్ గా దీనిని పేర్కొనవచ్చు. భారీ వర్షపాతాల కారణంగా ఈ ప్రాంతం వసంతకాలంలో తప్ప ఏడాది పొడవునా మూసే వుంటుంది.లెహ్ మరియు శ్రీనగర్ ని కలిపే జాతీయ రహదారి ఒకటి ద్వారా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.



Click it and Unblock the Notifications