వింధ్యగిరి దేవాలయం వింధ్యాగిరి హిల్స్ పై ఉంది. వింధ్యగిరి దేవాలయాన్ని ఒడెగల బసడి అని కూడా అంటారు. ఇది కొండపై ఉంటుంది. 572 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఈ దేవాలయ నిర్మాణ శైలి అంతా కొండలను చెక్కబడి నిర్మించినది. పైకి వెళ్ళే సమయంలో యాత్రికులు వివిధ చిన్న మందిరాలను కూడా చూడవచ్చు. వింధ్యగిరి దేవాలయం చేరితన భక్తులు అక్కడ అందమైన జైన్ తీర్ధంకర అంటే నేమినాధ, శాంతినాధ మరియు ఆదినాధుల చిత్రపటాలను చూడవచ్చు. ఈ దేవాలయంలో గుళ్ళకయాజి కూడా ఒక విశేషమైన దేవతగా ఉంటుంది. ఈమె పద్మావతి దేవి అవతారంగా చెపుతారు. వింధ్యగిరి దేవాలయ ప్రవేశం ఒకే రాయితో నిర్మాణం చేయబడింది కనుక అఖండు బాగిలు అని కూడా అంటారు. బాహుబలి మరియు భరత శిల్పాలను కూడా ప్రవేశంలో చెక్కారు.