నక్ష్ బంది మందిరం అని పిలవబడే ఖ్వాజా మొయినుద్దీన్ నక్ష్ బంది ఖన్కా శ్రీనగర్ నగరం నడిబొడ్డున ఉంది. ఈ మందిరానికి మహమ్మదీయ విశ్వాస వ్యవస్థ లో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. హజరత్బల్ మసీదు కి తరలించక ముందు మొయి-ఎ-ముకద్దస్ లేదా మహమ్మద్ ప్రవక్త కేశాలు ఇక్కడే ఉంచబడ్డాయని నమ్ముతారు.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ మసీదు ని నిర్మించాడు. ఈ నిర్మాణం సంక్లిష్టమైన ఖతంబంద్ పైకప్పులు వల్ల ప్రసిద్ధి చెందింది. ఖతంబంద్ అనగా చిన్న చెక్క ముక్కలను మేకులు ఉపయోగించకుండా, కేవలం చేతి పనితోనే కలిపి, జాతీయ నమూనాలు గా అమర్చి, పురావస్తు పరిశోధనా సంబంధ ప్రాముఖ్యత కలిగిన శాసనాలు రాసే ఒక పై కప్పు కళ.



Click it and Unblock the Notifications