శ్రీ ప్రతాప్ సింగ్ సంగ్రహాలయం జీలం నది ఒడ్డున క్రీ.శ. 1898 లో స్థాపించబడింది. మొదట్లో సంగ్రహాలయం లో సాలువలు మరియు ఖజానా లేదా ‘తోష్ ఖానా’ లో దొరికిన ఆయుధాలు ప్రదర్శింపబడుతూ ఉండేవి. ఈ సంగ్రహాలయంలో లో మొదటి సారి గా పరిహస్పొర, అవంతిపుర పండేరెంతాన్ వద్ద త్రవ్వకాలలో దొరికిన పురాతన వస్తువులను ప్రదర్శించారు. ఉష్కూర్ అనే బౌద్ధ స్థలం నుండి లభించిన 3వ శతాబ్దపు విలువైన, పురాతన టెర్రకోట తలలు ప్రదర్శించబడుతున్నాయి. 4వ మరియు 5వ శతాబ్దంలో హర్వాన్ లో కనుగొన్న పోత పోసిన టెర్రకోట ను కూడా ఈ సంగ్రహాలయంలో చూడవచ్చు.
బౌద్ధ ధ్యాన దైవం లోకేశ్వర, మరియు హిందూ దైవం మహా విష్ణువు యొక్క పచ్చ రాతి విగ్రహం ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ప్రతిమ హిందూ పురాణాలలో కనిపించే గరుడ లాంటి పెద్ద పక్షి పై కూర్చుని ఉంది. గాంధార నిర్మాణ శైలి కి అద్దం పట్టే ప్రదర్శన 5వ శతాబ్దానికి చెందిన రాగి బుద్ధుని శిల్పం కూడా ఈ సంగ్రహాలయంలో లో ప్రదర్శించబడుతున్నది.
సంగ్రహాలయంలో లో వివిధ కళాఖండాలు వాటి కాలం, శైలి మరియు సామగ్రి ఆధారంగా జాగ్రత్తగా ఒక వరుసలో పొందు పరచబడి ఉన్నాయి. సంగ్రహాలయంలో లో సేకరణలు నాణాలు, చేతి ప్రతులు, సూక్ష్మ చిత్రలేఖనం, ఆయుధాలు మరియు పరికరాలు, పచ్చిక మరియు విల్లో చెట్టు పని, గృహోపకరణములు మరియు అలంకార వస్తువులు మరియు సంగీత పరికరాలు వంటి విభాగాలుగా విభజించారు. ఇంకొన్ని విభాగాలలో వస్త్రాలు మరియు తివాచీలు, తోలు వస్తువులు, శిల్పాలు, పెంకులు మరియు కాశ్మీర్ లో వివిధ ప్రాంతాలలో త్రవ్వబడిన ఇతర వస్తువులు ఉన్నాయి. ఇవి కాక సహజ వస్తువులు, చారిత్రక వస్తువులు మరియు పక్షులు, జంతువుల బొమ్మలకి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications