శృంగేరి మఠానికి పడమటి భాగంలో కరే ఆంజనేయ దేవాలయం ఉంటుంది. దీనిని ఆది శంకరాచార్యులు స్ధాపించారు. 27 మెట్లు ఎక్కి ఈ దేవాలయం చేరాలి. ఈ దేవాలయం చేరగానే యాత్రికులు పెద్ద హనుమాన్ విగ్రహాన్ని ,శివుడిని, గణేష విగ్రహాన్నిచూస్తారు. ఈ ఆంజనేయవిగ్రహం తన కూడి చేతితో ఆశీర్వాదాలు అందజేస్తుంది. మరో చేతిలో కమలం ఉంటుంది. భక్తులు అధిక సమయం ఇక్కడ ధ్యానం చేయవచ్చు. ఇక్కడ ప్రధాన వేడుక అంటే దీపోత్సవం. దీనిని కార్తీక క్రిష్ణపక్ష నెలలో శనివారాలు చేస్తారు.



Click it and Unblock the Notifications