శృంగేరి మఠాన్ని తప్పక చూడాలి. ఇది హిందువుల అద్వైత మఠం. శృంగేరి శారదా పీఠం అని అంటారు. దీనిని ఆది శంకరాచార్యులు స్ధాపించారు. శృంగేరి మఠం లోపలి భాగం కొంచెం ఎత్తుగా నక్షత్ర రూపంలో ఉంటుంది. ఈ మఠం తుంగ నది ఒడ్డున ఉంది. యజుర్వేద ఆధారంగా వ్యవహరిస్తోంది. ఈ మఠం లోని శిల్ప కళ హోయసల మరియు ద్రవిడ తీరులో ఉంటుంది. ఇక్కడకు వచ్చిన వారు విద్యా తీర్ధ లింగాన్ని రాశులను సూచించే 12 స్తంభాలను దర్విస్తారు. ఈ స్తంభాలు నెలల వారీగా సూర్య కిరణాలను మొదటగా పొందుతూంటాయి.