ఈ టెంపుల్ వల్లకోట్టై విలేజ్ లో శ్రీ పెరంబుదూర్ కు 9 కి.మీ.ల దూరంలో కలదు. ఇది 1200 సంవత్సరాల క్రిందటిది. ఈ టెంపుల్ లో 7 అడుగుల ఎత్తు కల పొడవైన మురుగన్ విగ్రహం వుంటుంది. ఇది తమిళ్ నాడు లో పొడవైనదిగా చెపుతారు. మురుగన్ భార్యలైన దేవయాని మరియు వల్లిల విగ్రహాలు కూడా వుంటాయి.
ఈ టెంపుల్ ను భగీరథ,తన రాజ్యాన్ని తిరిగి పొందేందుకు, మహర్షి దూర్వాసుడి సలహాపై నిర్మించాడని చెపుతారు. మరొక కధనం మేరకు వాళ్ళం అనే రాక్షసుడు దేవతలను బాధించాడని, మురుగన్ వానిని ఓడించి ఆ ప్రాంతంలో శాంతి ఏర్పరచడాని, ఆయన గౌరవార్ధం ఈ టెంపుల్ నిర్మించారని చెపుతారు. ఈ టెంపుల్ లో ఒకకొలను, కలదు. దానిని వజ్ర తీర్థం అంటారు.
దీనిని ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఏర్పరచాడని చెపుతారు. ఇంద్రుడు ఈ ట్యాంక్ నీటితో సుబ్రహ్మనేస్వరుడిని అభిషేకిన్చాడని చెపుతారు. ఇక్కడే శ్రీ వినయగర్, శ్రీ అంబాల్, ఉత్సవ మురుగర్ మరియు శ్రీ శంముగర్ విగ్రహాలు, తపస్ కామాక్షి మరియు లార్డ్ రామ అన్జనేయుడిని కౌగిలించుకొనే చెక్కడాలు కూడా ఇక్కడ కల అర్ధ మండపం స్తంభాల పై చూడవచ్చు. ఈ టెంపుల్ పని గంటలు ఉ.5.30 గం నుండి మ.1 గం. వరకూ మరియు మ. 3 గం నుండి రా.8.30 గం. ల వరకూ తెరచి వుంటుంది.