ఈ మునిసిపల్ పట్టణం మలబార్ కోస్ట్ మీద, కన్యాకుమారి పట్టణానికి 20 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ పట్టణం కోలచెల్ యుద్ధానికి సాక్ష్యంగా నిలిచింది, దీనికి ప్రజల్లో ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యత గురించి అనుకున్నంతగా తెలీదు. కోలచెల్ నేల మీద 1741 లో, యుద్ధం జరిగింది. భారతదేశ చరిత్రలో నిలిచే విధంగా, భారత సామ్రాజ్యం యూరోపియన్ దేశం యొక్క నావికా దళాలను ఓడించింది. డచ్ సైన్యం ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టాలన్న దురుద్దేశ్యంతో, కోలచెల్ మీద కాలు మోపింది. మార్తాండ వర్మ, ట్రావన్కోర్ రాజు డచ్ సైన్యాన్ని తిరుగులేని విధంగా, తిరిగి ఇండియాలో ఏ భాగాన్నిచూడటానికి భయపడే విధంగా ఓడించాడు. ఈ యుద్ధంలో విజయం, ఒక చిన్న సామ్రాజ్య సైన్యానికి ఒక గొప్ప విజయం. డచ్ సైనికులు చాలామంది పట్టుబడ్డారు. వారిలో ఒకరు, అడ్మిరల్ డి'లెన్నొయ్, ఈయన మార్తాండ వర్మ సైనిక సీనియర్ అడ్మిరల్ గా 20 సంవత్సరాలు పని చేశారు.