ఆనందోత్సాహాలతో వుండే వారికి సాహస ప్రియులకు ట్రెక్కింగ్ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక్కడ 3 రోజుల ట్రెక్కింగ్ టూర్లు కలవు. ఇక్కడ నిర్వహించే ట్రెక్కింగ్ టూర్లు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. చెండురూనీ అభయారణ్యంలో పక్షి సందర్శకులకు పక్షులను సందర్శించే అవకాశం కలదు. పర్యాటకులు పక్షి సందర్శనను కూడా బాగా ఆనందించగలరు.తేన్మల నేషనల్ ఎడ్వంచర్ ఫౌండేషన్ నిర్వహించే ట్రెక్కింగ్ లో కూడా పర్యాటకులు పాల్గొనవచ్చు. ఇది ఎకో టూరిజం లో ఒక భాగంగా ఉంటుంది. పర్యాటకులు వివిధ ట్రెక్కింగ్ ప్రోగ్రాములు ఎంచుకొనవచ్చు. మిరిస్తిక స్వామ్ప్ కు 4కి.మీ. కల చిన్న ట్రెక్కింగ్ దూరం పర్యాటకులను ఉత్సాహభారితులను చేయటమే కాక ఎన్నోప్రాంత వివరాలను అందిస్తుంది.బైకర్లు ఈ ప్రాంతాన్ని వారి సాహస కార్యాలకు ఎంతో ఇష్టపడతారు. బైకింగ్ చేసే సమయంలోనే బర్డ్ వాచింగ్ కూడా చేయవచ్చు.