శ్రీ సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ టూరిస్టులను, యాత్రికులలోను తిరుత్తని మురుగన్ టెంపుల్ గా ప్రసిద్ధి చెందినది. ఇది హిందువుల ప్రసిద్ధ యాత్రా స్థలాలలో ఒకటి. తమిళ్ నాడు లో కల ఆరుసుబ్రహ్మణ్యస్వామి టెంపుల్స్ లో ఇది ఒకటి. దీనిని ఆరుపడాయి వీడు అంటారు. పురాణ గాధల మేరకు ఈ దేముడు వల్లి అనే ఒక గిరిజన నాయకుడి కుమార్తెను వివాహం చేసుకుంటారు. దానితో ఈ ప్రదేశం ఒక ప్రసిద్ధ యాత్రా స్థలంగా మారింది. శ్రీ సుబ్రమణ్యస్వామి టెంపుల్ ను అనేక మంది రాజులు, స్థానిక నేతలు మరియు జమిందార్లు బాగా భక్తి శ్రద్ధలు చూపేవారు. ఈ టెంపుల్ గురించి ప్రాచీన గ్రందాల లో కూడా కలదు. ఈ టెంపుల్ చేరాలంటే 365 మెట్లు ఎక్కాలి. ఇది 365 రోజులను చూపుతుంది. ఇక్కడే ఒక గణపతి టెంపుల్ కలదు. గణపతి , తన సోదరుడు సుబ్రహ్మణ్యస్వామి అక్కడి కొండ జాతి నాయకుడితో యుద్ధం చేయటంలో సహకారించాడని చెపుతారు. రోడ్డు మార్గంలో టెంపుల్ చేరవచ్చు. దైనందిన పూజలు ఇక్కడ జరుగుతాయి.