తిరువల్ల పట్టణానికి 6 కి.మీ ల దూరంలో ఉన్న కవియూర్ మహాదేవ ఆలయం కేరళ లోనే అత్యంత ప్రాచీన శివాలయం. గోపురాలతో కూడిన ఒక అద్వితీయమైన నిర్మాణానికి ఈ గుడి ప్రసిద్ధి చెందింది. ఏటవాలుగానున్న పైకప్పు వల్ల ఏర్పడిన త్రిభుజాకారం ఈ భవనం యొక్క విశిష్టత. తిరిక్కవియూర్ మహాదేవ ఆలయం గా పేరు గాంచిన వందేళ్ళ చరిత్ర గల ఈ గుడి, దక్షిణ భారత దేశం లోనే పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాయలయం లో ప్రజలు భక్తి శ్రద్ధలతో మహాదేవున్ని, పార్వతి దేవిని కొలుస్తారు.డిసెంబర్ మరియు జనవరి నెలల్లోని ఆలయ ఉత్సవానికి , ఇంకా హనుమాన్ జయంతి కి భక్త జన సందోహంతో కవియూర్ కోలాహలంగా ఉంటుంది. ఈ ఆలయ గోడల పై ఉన్న 16 వ శతాబ్దానికి చెందిన పురాతన చెక్కడాలలో ప్రధానంగా రామాయణం ,మహాభారతం లాంటి పురణాల లోనించి నించి స్వీకరించిన వాక్యాలు కనవచ్చు. ఈ గుడిలో కలప యొక్క విస్తృత వినియోగాన్ని గమనించవచ్చు. ప్రాచీన చెక్కడాలతో కూడిన ఈ అపూర్వమైన కట్టడం నిజంగా ఒక నిర్మాణ శాస్త్ర వింత. చూపరులను ఆకట్టుకోవడం ఖాయం.