చక్కులతు కవు ఆలయం తిరువల్ల కు పశ్చిమాన 12 కి.మీ ల దూరంలో ఉంది. అందమైన దృశ్యాలకి నెలవైన ఇక్కడికి , యాత్రికులు కుడా భక్తుల తో సమంగానే వస్తారు. పంపా, మణిమాల నదుల మధ్య ఒదిగి ఉన్న ఈ ఆలయం పతనంతిట్ట, అలప్పుళ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ దేవాలయం సుమారు మూడు వేల సంవత్సారాల క్రితం కట్టబడింది. ఇక్కడ బగవతి అమ్మవారు పూజలందుకుంటారు. ఈమెకే చక్కులతమ్మ అని మరో పేరు.చక్కులతు కవు ఆలయం "మహిళల శబరిమల" గా పేరిన్నిక గన్నది. ఇక్కడ నవంబర్ డిసెంబర్ నెలలలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. అడవి మధ్యలో ఉండటం వల్ల యాత్రికులకు ఇది ఒక ప్రశాంతమైన వాతావరణం అందిస్తుంది. రెండు నదుల సంగమం ముగ్ధమనోహరంగా ఉంటుంది. ఇక్కడ పడవ పోటి బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ నీటిలో అటూ ఇటూ తేలుతూ పడవ నడపటం ఒక అనిర్వచనీయమైన అనుభూతి.