తమిళనాడులోని ఉదయగిరి కోట తిరువత్తర్ పట్టణానికి అతి దగ్గరగా, నాగర్ కోయిల్ పట్టణం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువంతపురం-నాగర్ కోయిల్ జాతీయ రహదారిపై ఉండటం వలన ఈ కోటను చూడటం మరవలేకపోవచ్చు.
ఈ కోటను 17వ శతాబ్దంలో నిర్మించగా, ట్రావన్ కోర్ మహారాజు మార్తాండ వర్మ దీనిని 18 వ శతాబ్ద౦లో పునర్నిర్మించాడు. ఈ కోట నిర్మాణానికి ప్రధాన కారణం తుపాకుల తయారీకి ఒక ప్రదేశం అవసరమవ్వడమే. ఈ ప్రయోజనం కోసం ఒక ఫౌండ్రీని ప్రత్యేకంగా నిర్మించారు. ఇప్పటికి ఉన్నఈ ఫౌండ్రి అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కోటలో కొంత కాలం చెరసాలలో ఉన్న టిప్పుసుల్తాన్ తో బాటుగా అనేకమంది ప్రసిద్ధ ఖైదీలు నివసించారు.
ఈ కోట పై కాల౦, ప్రకృతి ప్రభావాలను చూడవచ్చు, అయినప్పటికీ, ఈ కట్టడం ఎత్తుగా, బ్రహ్మాండంగా తిరువత్తర్ సాహస చారిత్రిక సంపదకు సాక్ష్యంగా నిలబడింది.