తమిళనాడులోనే తిరునల్వేలిలోని నెల్లైఅప్పర్ ఆలయం అతి పెద్దది. క్రీ.శ. 700 పాండ్యులు నిర్మించిన ఈ ఆలయంలో శివుడు, పార్వతి దేవిల రెండు విలక్షణమైన విగ్రహాలు ఉన్నాయి. ఇవి 17 వ శతాబ్దంలో నిర్మించిన సంగిలి మండపంతో అనుసంధానమై ఉన్నాయి. ఈ ఆలయ గోపురాలను కూడా 17 వ శతాబ్దంలో నిర్మించారు. పురాణాల ననుసరించి శివుడు తాండవ నృత్యం చేసినట్లుగా తెలిపే ప్రదేశం అయినందున ఈ ప్రాంతం శాస్త్రీయ నృత్యాలతో బాటుగా ఇతర కళారూపాలకు కూడా ఒక ముఖ్య కేంద్రమైంది. ఈ నమ్మకాన్ని బలపరిచే తామిరై అంబలం లేదా “రాగి వేదిక” కూడా ఆలయం లోపల ఉంది.
తిరుకల్యాణ౦, నవరాత్రి, ఆరుద్ర దరిసనం వంటి పండుగల కాలంలో నెల్లై అప్పర్ ఆలయాన్ని సందర్శించడం వలన బహుమతి అందుకొన్న అనుభవం కల్గుతుంది. ఇవి తమిళ నెల ఐప్పసిలో అక్టోబర్ 15 నవంబర్ 15 మధ్య కాలంలో జరుగుతాయి. ఈ ఆలయంలో జరిగే మరొక ప్రసిద్ధ పండుగ తైపూసం. ఈ ఆలయం కచ్చితంగా పట్టణం మధ్యలో ఉన్నందున సందర్శకులకు దీనిని కనుగొనడంలో ఎటువంటి ఇబ్బందులు కలగవు.