కప్పల మాతా చర్చి మేరీ మాతకు చెందినది. ఇది సముద్ర తీరంలో, ఓడను పోలిన ఆకారంలో కట్టిన చర్చి. సముద్ర కోత వలన అసలు కప్పల్ మాతా చర్చి ధ్వంసమయ్యింది. ఈ చర్చికి సంబంధించిన అనేక సంప్రదాయాలు, విశ్వాసాలు వాడుకలో ఉన్నాయి. ఇటువంటి ఒక సంప్రదాయం ప్రకారం యుక్తవయసులో ఉన్న స్త్రీలు ఇక్కడ గల మఠంలో ఒక రాత్రి బస చేయాలి. దీపాలు గాని, కొవ్వత్తులు గాని వెలిగించక పోయినప్పటికీ సెల్వమాత విగ్రహంపై ఒక వెలుగు ప్రత్యక్షమై ఒక గంట వరకు వెలుగుతూనే ఉంది. అందువల్ల, ఇలా జరిగిన సెప్టెంబర్ నెల 18 వ తేదీన, ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకుంటారు. ఈ చర్చిని గోవా మిషన్ వారు చాలా ఏళ్ళు నిర్వహించారు. ఈ చర్చి తిరునల్వేలి నుండి 75 కిలోమీటర్ల దూరంలో, ఉరవి అనే కోస్త తీర గ్రామంలో ఉంది.