శ్రీ అల్జియా మన్నార్ రాజగోపాలస్వామి ఆలయం సుమారు వెయ్యేళ్ళ కిందటిదే కాక దక్షిణ భారతదేశంలోని అతి పురాతన ఆలయాలలో ఒకటి. ఇక్కడి దైవాన్ని పూజించడానికి దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు. సాధారణంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తే భక్తులకు వచ్చిన తీవ్రమైన వ్యాధులు నయమౌతాయని విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించి దేవుని పూజిస్తే వారి పాపాలు తొలిగిపోతాయని కూడా భక్తులు విశ్వసిస్తారు. జీవితంలో ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ వ్యాధులను నయం చేసి, తిరిగి సాధారణ జీవితం గడపడానికి సహాయం చేస్తుందని విశ్వసిస్తారు.