G20 సదస్సులో భాగంగా ఢిల్లీలోని ఈ ప్రాంతాలను చూసేయండి..
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ప్రతి ఒక్కరూ విశ్రాంతి, ప్రశాంతత కోసం వెతుకుతారు. ఇటువంటి సమయంలో చాలామంది ఒక్కరోజు సెలవు దొరికితే చాలు, ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతంగా గడపాలని ఆలోచిస్తుంటారు. ఢిల్లీలో నివసిస్తున్నవారికైతే తప్పకుండా ఈ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే, సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇండియా తొలిసారిగా జి20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సదస్సుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న ఈ సదస్సు కారణంగా సెప్టెంబర్ 8-10 తేదీల్లో మూడు రోజుల పాటు ఢిల్లీ బంద్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సెలవుల కారణంగా, ఢిల్లీవాసులకు ఇప్పుడు లాంగ్ వీకెండ్ దొరికింది. చాలా మంది ఈ సెలవుల్లో వెంటనే ప్రయాణం చేయడానికి ప్రణాళికలు వేసుకుంటుంటారు. ఈ బంద్ సందర్భంగా ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం తప్పకుండా ఢిల్లీకి సమీపంలోని ఈ ప్రాంతాలను చుట్టేయండి మరి..

లక్నో
లక్నో ఉత్తర ప్రదేశ్ రాజధాని నగరం. ఈ ప్రాంతం ఎల్లప్పుడూ బహుళ సాంస్కృతిక నగరంగా ఉంది. ఇక్కడి మర్యాదలు, అందమైన ఉద్యానవనాలు, కవిత్వం, సంగీతం, నగరానికి చెందిన పర్షియన్-ప్రియులైన షియా నవాబులచే అందించబడిన చక్కటి వంటకాలు, దక్షిణాసియా సంస్కృతి బాగా ప్రసిద్ధి చెందాయి. లక్నోలో సందర్శించేందుకు ఎన్నో అనువైన ప్రదేశాలున్నాయి. ఇక్కడ వీధి దుకాణాల్లో అన్యదేశ ఆభరణాలు, ఉపకరణాలు, ఇత్తర్ (స్థానిక పరిమళ ద్రవ్యాలు), బొమ్మలు, ల్యాంప్షేడ్లు, డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు, బ్యాగ్లు, దుస్తులు, ఫాబ్రిక్, సాంప్రదాయ నాగ్రా పాదరక్షలు, చికంకారి సూట్లు, హస్తకళలకు ప్రసిద్ధి చెందిన వస్తువులు చాలానే ఉన్నాయి. ఈ లాంగ్వీకెండ్లో తప్పకుండా లక్నోను సందర్శించేయండి. ఇంకా, ఇక్కడ బడా ఇమాంబారా, ఛోటా ఇమాంబారా, రూమి దర్వాజాలను చూడొచ్చు.

ఆగ్రా
1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన తాజ్ మహల్కి ఆగ్రా బాగా ప్రసిద్ధి చెందింది. తాజ్ మహల్ తరచుగా మొఘల్ వాస్తుశిల్పానికి ప్రపంచంలోనే అత్యుత్తమ ఉదాహరణగా పరిగణించబడుతుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 17వ శతాబ్దం మధ్యలో తన భార్య ముంతాజ్ కోసం ఈ మహల్ను నిర్మించాడు. ఆగ్రాలోని యమునా నదికి దక్షిణ ఒడ్డున ఉన్న దంతపు-తెలుపు పాలరాతి సమాధి ఇది. చారిత్రక ప్రదేశాలను ఇష్టపడే వారికి ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ఇక్కడ తాజ్ మహల్, ఆగ్రా కోటను చూడొచ్చు. ఈ ప్రాంతం గొప్ప చరిత్ర, వాస్తుశిల్పానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జై విలాస్ ప్యాలెస్, సూర్య దేవాలయం, గ్వాలియర్ కోటలను చూడొచ్చు.

మండవ
ఢిల్లీకి సమీపంలోని ఈ చిన్న పట్టణం అందంగా చిత్రించిన హవేలీలకు ప్రసిద్ధి చెందింది. ఈ హవేలీల గోడలపై ఉన్న అందమైన కుడ్యచిత్రాలు, కళాఖండాలు ఈ ప్రాంతపు కళాత్మక వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఈ చిన్న గ్రామం 18వ, 19వ శతాబ్దాలలో ఒకప్పుడు వ్యాపారులకు నిలయంగా ఉండేది. ఇక్కడ హనుమాన్ ప్రసాద్ గోయెంకా హవేలీ, చోఖానీ డబుల్ హవేలీ, ముర్మురియా హవేలీ వంటి ఇతర ప్రదేశాలను కూడా సందర్శించొచ్చు.

అమృత్సర్
ఈ లాంగ్ వీకెండ్లో ఢిల్లీ సమీపంలోని ప్రాంతాలని సందర్శించాలనుకుంటే మాత్రం తప్పకుండా అమృత్సర్ని సందర్శించాల్సిందే. ఇక్కడ చరిత్ర, ఆధ్యాత్మికత, సంస్కృతుల గొప్ప మిశ్రమాన్ని చూడొచ్చు. అంతే కాదు, ఈ ప్రదేశం ఆహార ప్రియులకు, షాపింగ్ ప్రియులకు కూడా ఎంతో అనువైనది.



Click it and Unblock the Notifications













