శంలోని అద్భుతమైన శివుని గుహలను చూశారా?
పవిత్రమైన శ్రావణ మాసం కొనసాగుతోంది. ఈ మాసం శివునికి అంకితం చేయబడింది. ఈ సమయంలో భోలేనాథ్ను ప్రసన్నం చేసుకోవడానికి, భక్తులు నిత్యం పూజలు చేయడంతోపాటు ఉపవాసాలు పాటిస్తారు. మహాదేవుడిని హృదయపూర్వకంగా పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఈ ప్రత్యేక మాసంలో భోలేనాథ్ సందర్శనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి శివాలయం పెద్ద సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈ మాసంలో శివ దర్శనం, పూజలు చేయడం ద్వారా భక్తులు తమను తాము అదృష్టవంతులుగా భావిస్తారు. దేశంలోని ప్రసిద్ధ శివాలయాలను చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ శివుని గుహలను సందర్శించండి. ముందుగా ఈ గుహలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
అమర్నాథ్ గుహ హిందువుల ప్రసిద్ధ ధార్మిక ప్రదేశం. అయితే ఇది కాకుండా దేశంలో అనేక శివుని గుహలు ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కోటేశ్వర్ గుహ, ఉత్తరాఖండ్
కోటేశ్వర్ గుహ శివుని గుహ. ఈ గుహ అలకనంద నది ఒడ్డున ఉంది. దీనిని కోటేశ్వర్ మహాదేవ్ దేవాలయం అంటారు. ఇది ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా నుండి కొంత దూరంలో ఉంది. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగం సహజసిద్ధంగా నిర్మితమైందని భక్తులు నమ్ముతారు. ఈ గుహ చుట్టూ అందమైన ప్రకృతి దృశ్యాలను చూడొచ్చు. పురాణాల ప్రకారం శివుడు కేదర్నాథ్ వెళ్లే సమయంలో ఇక్కడ ధ్యానం చేసాడని, అప్పడు ఆ విగ్రహం సహజంగా ఏర్పడిందని చెబుతుంటారు. ఇక్కడ మహాశివరాత్రి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఇక్కడ ఉత్సవాలు సైతం జరుపుతుంటారు.

బాదామి గుహలు, కర్ణాటక
ఈ అందమైన గుహలు కర్ణాటకలోని ఉత్తర మధ్య భాగంలో ఉంది. ఈ గుహ లోపల నాలుగు ఆలయాలు నిర్మించబడ్డాయి. వీటిలో ఒకటి శివునికి అంకితం చేయబడింది. బాదామి రాతి గుహలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. బాగాల్కోట్ జిల్లాలోని బాదామి అనే పట్టణం సమీపంలో ఈ అరుదైన ఎర్రరాతి గుహలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మొదట్లో వాతాపి అని పిలిచేవారు. ఇక్కడి రాతి గుహలు, అందులోని శిల్ప కళలు, దేవాలయాలు పర్యాటకులనే కాకుండా చరిత్రకారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ గొప్ప చారిత్రక ప్రాంతాన్ని వారసత్వ సంపద నగరంగా గుర్తించారు.

పల్లవ గుహలు, కేరళ
పల్లవ గుహలు కేరళలోని తిరుచిరాపల్లి రాతి కోటలో ఉన్నాయి. ఇందులో శివుడు, విష్ణువు ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రదేశం భక్తులలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ గుహలు క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో నిర్మించిన నాలుగు రాక్కాట్ గుహ దేవాలయాల సముదాయం. ఈ ప్రదేశం కాంచీపురం నుండి కొంత దూరంలో ఉంది.
మండపేశ్వర్ గుహలు, ముంబై
మండపేశ్వర్ గుహలు శివునికి అంకితం చేయబడ్డాయి. ఈ ఆలయాన్ని సుమారు 1600 సంవత్సరాల క్రితం గుహలను కత్తిరించి నిర్మించారని చెబుతుంటారు. ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 8వ శతాబ్దంలో ఈ మండపేశ్వర్ గుహలను నిర్మించారు. మౌంట్ పోయిన్సూర్, బోరివాలి వద్ద ఉన్న ఇవి ముంబైకి సమీపంలో ఉన్న ఇతర బౌద్ధ గుహల వలె కాకుండా శివునికి అంకితం చేయబడిన ఏకైక గుహలు.

ఎలిఫెంటా గుహలు, మహారాష్ట్ర
ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇవి ముంబై నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహ లోపల శివుని అనేక రూపాలను చూడొచ్చు. ఇక్కడ ఇతర దేవతల అద్భుతమైన విగ్రహాలను కూడా చూడొచ్చు. గుహ గోడలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని రాతితో అద్భుతంగా చెక్కారు.



Click it and Unblock the Notifications















