విశాఖలోని ఈ ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలను చూశారా..
విశాఖపట్నంలో అడుగుపెట్టింది మొదలు చూడదగిన ప్రదేశాలకు లోటు లేదని చెప్పొచ్చు. నగరంలో ఎటు అడుగులు వేసినా వినోదం, సాహసం, అనేక చారిత్రక మరియు సంస్కృతితో నిండి ప్రదేశాలే పలకరిస్తాయి. తీరప్రాంతపు అందాలు, పచ్చని కొండలు, వారసత్వ ప్రదేశాలు, మతపరమైన సంస్థలు ఇలా చెప్పుకుంటూపోతే ఈ నగరం నిజంగా పర్యాటకుల స్వర్గధామం.
వైజాగ్లో ప్రతి ఒక్క టూరిస్ట్ కోసం ఏదో ఒక టూరిస్ట్ స్పాట్ ఉంటుంది. జంతు ప్రేమికులు, చరిత్ర ప్రేమికులు కేవలం కొన్ని మనోహరమైన దృశ్యాలను కోరుకునే వారు ఇక్కడ వాలిపోతుంటారు. అయితే, విశాఖపట్నం ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా నిలయంగా నిలుస్తోందని చాలా మందికి తెలీదు. అందుకే, వైజాగ్లో కొలువైన చారిత్రక నేపథ్యం ఉన్న మతపరమైన ప్రసిద్ధ ప్రదేశాలను మీకు పరిచయం చేస్తున్నాం.

సింహాచలం
ఈ పేరువినగానే ఒకరకమైన ఆధ్యాత్మిక భావన మనసులో కదులుతుంది. అంతటి పేరుప్రఖ్యాతలు గాంచింది సింహాచలం. కుటుంబసమేతంగా అరకు మరియు బీచ్ సందర్శించడం కాకుండా వైజాగ్లో సెలవు రోజులను గడిపేందుకు ఎక్కవమంది ఎంపిక సింహాచలం. సింహాచలం - వైజాగ్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులతో కూడిన కొండపై ఉన్న ఈ ఆలయం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన ప్రదేశంగా భావిస్తారు. ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల నాటిది. ఇది 1098 AD నాటిదిగా గోడలపై శాసనాలను బట్టీ నిర్ధారించారు. ఈ ఆలయం దేశంలోని 18 నరసింహ క్షేత్రాలలో ఒకటి.

TTD ఆలయం రుషికొండ
దీనిని నూతంగా నిర్మించినప్పటికీ నగరవాసులతో నిత్యం రద్దీగా ఉంటుంది. 23 మార్చి 2022న ప్రారంభించబడిన ఈ ఆలయం బంగాళాఖాతం యొక్క సుందరమైన దృశ్యాన్ని ఇక్కడికి వచ్చే సందర్శకులకు అందిస్తుంది. ఈ ఆలయం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. అంతేకాదు, ఇందులో భూదేవి మరియు శ్రీదేవి దేవతలకు ప్రధాన ఆలయం పక్కన రెండు ఆలయాలతో పాటు హనుమంతుని విగ్రహం కూడా ఉంది. కుటుంబసమేతంగా విడిట్ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఈ ఆలయం రుషికొండలో ఉంది.

రాస్ హిల్
స్థానిక గైడ్ అయిన మాన్సియూర్ రాస్ పేరు పెట్టబడిందని నమ్ముతారు. ఈ కొండ ఓడరేవుతోపాటు నగరంలోని కొన్ని ప్రాంతాల యొక్క సుందరమైన వీక్షణలను అందిస్తుంది. రాస్ హిల్ స్థానికంగా మేరీ మాత గుడి అని పిలువబడే శతాబ్దాల నాటి చర్చికి ప్రసిద్ధి చెందింది. ఈ చర్చ్కు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. చర్చ్ నిర్మాణ శైలి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ కొండ వన్-టౌన్ ప్రాంతంలో ఉంది.

దర్గా కొండ
ఈ దర్గా హిందువులు మరియు ముస్లింలు గౌరవించే ముస్లిం సెయింట్ బాబా ఇషాక్ మదీనా వాలికి అంకితం చేయబడింది. అతను సుమారు 700 సంవత్సరాల క్రితం కొండపై తన అనుచరులతో స్థిరపడ్డాడు. అప్పటి నుండి విపత్తుల సమయంలో నగరం యొక్క భద్రత ఈ అప్రసిద్ధ సాధువుకు ఆపాదించబడింది. రాస్ హిల్ ఎదురుగా ఉన్న కొండపై దర్గా ఉంది. సర్వమత సమ్మేళనానికి ఈ దర్గా నిదర్శనంగా చెప్పబడుతోంది.



Click it and Unblock the Notifications













