Search
  • Follow NativePlanet
Share
» »పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది.

By Venkatakarunasri

పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్ధయాత్రను పూరీను సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయినదని భావిస్తారు. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో ప్రముఖమైనది. ఇక్కడ రాధా, దుర్గ, లక్ష్మి, పార్వతి, సతి, మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి, పురుషోత్తమ క్షేత్ర, పురుషోత్తమ ధర్మ, నీలాచల,నీలాద్రి, శ్రీక్షేత్ర, శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీలో గొప్ప రథం ఫెస్టివల్ ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో రథయాత్ర లేదా రథం ఫెస్టివల్ సమయంలో సందర్శిస్తారు. పండుగ సమయంలో దేవతలైన జగన్నాథ్,బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను బాగా అలంకరించిన రథాల్లో ఉంచి గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చితిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

ఈ ఉత్సవము సాధారణంగా జూలై నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవము పూరీ పర్యాటక క్యాలెండర్ లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణగా చెప్పవచ్చు. పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు పర్యాటకులకు పురీలో సందర్శించటానికి అనేక ఆలయాలు ఉన్నాయి. హిందువులకు పూరీ భారతదేశంలో ఉన్న ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా ఉన్నది.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ ఆలయమే కాక చక్ర తీర్థా ఆలయం, ముసిమ ఆలయం, సునర గౌరంగ్ ఆలయం, శ్రీ లోక్నాథ్ ఆలయం, శ్రీ గుండిచ ఆలయం, అలర్నాథ్ ఆలయం మరియు బలిహర్ చండి ఆలయం మొదలైనవి హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలుఉన్నాయి.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

గోవర్ధన మఠం వంటి మఠాలు దైవిక ఉపశమనం అందిస్తున్నాయి. బేడి హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన స్థానిక పురాణము కలిగి ఉంది. పూరీ బీచ్ మరొక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది. వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పూరీ పర్యాటకంలో ఆకర్షణగా ఉంటుంది.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

ఈ బీచ్ ను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాక ఈ బీచ్ సుందరమైన వీక్షణ నిజంగా మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది. ఉదయిస్తున్న సూర్యుడి చూడటం లేదా అస్తమిస్తున్న సూర్యుడి చూడటంతో తీర్థయాత్ర ముగుస్తుంది అనుకుంటున్నారా? కానేకాదు పర్యాటకులు బలిఘి బీచ్ వద్ద కోణార్క్ సముద్ర డ్రైవ్ చేయవచ్చు.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ మతసంబంధ ఆసక్తికరమైన మరొక ప్రదేశం హిందూ మత శ్మశానం స్వర్గాద్వర్ ఉంది. పూరీ నుండి 14 కిమీ దూరంలో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని రఘురజ్పూర్ ఉన్నది. ఒరిస్సాలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన షాఖిగోపాల్ పూరీ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

నీటి ప్రేమికులు లేదా సర్ఫింగ్ ఆస్వాదించే వారికి మరొక అద్భుతమైన ఆకర్షణ కేవలం పూరీ నుండి 50 కిమీ దూరంలో సాత్పదా వద్ద ఉంది. పూరీ నుండి సాత్పదా చేరుకోవటానికి అనేక బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

విజయవాడ - కలకత్తా మార్గంలో పూరీ క్షేత్రం వున్నది. జగత్ - విశ్వం, నాథ్ - ప్రభువు అనే 2 సంస్కృతపదాల నుండి ఏర్పడింది జగన్నాథఅనే పదం. ఒరిస్సా రాష్టంలోని సముద్రతీర పట్టణం పూరీలో వేంచేసియున్న శ్రీకృష్ణుడు జగన్నాధుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు. గౌడియ వైష్ణవ మతస్థాపకుడైన చైతన్య ప్రభువు పూరీ క్షేత్రంలో చాలాకాలం జీవించాడు.వైష్ణవభక్తులకు ముఖ్యమైన విష్ణు క్షేత్రాలలో ముఖ్యమైనది పూరీ క్షేత్రం.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

క్రీ.పూ 1174లో కళింగరాజ్యాన్ని పాలించిన అనంగ భీమదేవుడు పూరీజగన్నాధ ఆలయాన్ని సంపూర్తిగా నిర్మించినట్లు అక్కడ లభించిన రాగిఫలకాలపై లిఖించబడిన శాసనాలవల్ల తెలుస్తున్నది.క్రీశ 1558లో ఆఫ్ఘన్ సేనలు పూరీఆలయం పై దాడులు చేసాయి.ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి కుర్దో ప్రాంతాన్ని రామచంద్రుడు అనే రాజు పాలించాడు.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

ఆయన కాలంలోనే పూరీఆలయాన్ని ప్రక్షాళన చేసి జగన్నాథునికి మరోలా పూజలు చేయటం ప్రారంభించటం జరిగింది.కొందరు పురావస్తు శాస్త్రఘ్నుల అభిప్రాయం ప్రకారం ఇప్పుడు పూరీ ఆలయం వున్న చోట పూర్వం ఒక బౌద్ధస్తూపం వుండేదని ఆ స్థూపం కింద గౌతమభుద్ధుని దంతం భద్రపరచిబడిందని తర్వాత పూరీ బౌద్ధస్థూపం పడగొట్టబడి అక్కడున్న బుద్ధుని దంతం శ్రీలంకలోని క్యాండిపట్టణానికి పంపబడిందని తెలుస్తున్నది.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

క్రీశ10వ శతాబ్దం నాటికి ఒరిస్సాని పాలిస్తున్న సోమవంశపు రాజులు వైష్ణవమతాన్ని ప్రోత్సహించారు.ఫలితంగా జగన్నాథుడికి ఆదరణ అపారంగా పెరిగింది. పంజాబ్ ను పాలించిన సిక్కుమహారాజు రంజిత్ సింగ్ పూరిజగన్నాథునికి వందల కిలోల కొద్దీ బంగారాన్ని బహుకరించాడు. తమ మతదేవాలయమైన స్వర్ణ దేవాలయానికి ఇచ్చిన బంగారం కన్నా అధికపరిమాణంలో పూరీ జగన్నాథుని బంగారాన్ని ఇచ్చిన సిక్ రాజు ధన్యుడు.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

రంజిత్ సింగ్ కి పూరిజగన్నాధుడిపై భక్తికి పరాకాష్టగా తన దగ్గరున్న ప్రపంచప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని జగన్నాథునికి అందజేయాలని వీలునామా రాసాడు. దురదృష్టవశాత్తు రంజిత్ సింగ్ మరణించిన వెంటనే ఆయన రాజ్యాన్ని బ్రిటీష్ వారు ఆక్రమించి పూరీజగన్నాథునికి చెందాల్సిన కోహినూర్ వజ్రాన్ని తాము స్వాధీనం చేసుకున్నారు.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ ఆకర్షణలు

స్వర్గాద్వర్

పూరీ లో స్వర్గాద్వర్ అనే ఒక హిందూ మతం శ్మశానం ఉంది. పేరులో సూచించినట్లుగా ఇది స్వర్గంనకు ద్వారం అని హిందువులు విశ్వసిస్తారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు ఈ స్థానంలో జరిగిన వివిధ పౌరాణిక కథల కారణంగా స్వర్గాద్వర్ ను సందర్శిస్తారు. ఈ పవిత్ర ప్రదేశంలో చనిపోతే నేరుగా స్వర్గం లోకి వెళ్లి పూర్తి మోక్షం పొందుతారని చెప్పుతారు. భక్తులు 'ముక్తి' పొందటానికి స్వర్గాద్వర్ బీచ్ లో స్నానం చేస్తారు. పవిత్ర బ్రహ్మదారుఈ ప్రదేశంలో పర్యాటకులను ఆకర్షించే మరొక పౌరాణిక కథ.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

సాత్పదా డాల్ఫిన్ కేంద్రం

సాత్పదా డాల్ఫిన్ కేంద్రం పూరీ నుండి 50 కిమీ దూరంలో ఒరిస్సా రాష్ట్రంలో తూర్పున ఉంది. ఇది రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది. అందమైన డాల్ఫిన్లతో పాటు, ఒక అసాధారణ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వీక్షణ అవకాశాలు ఉంటాయి.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

గోవర్ధన మఠం

గోవర్ధన మఠంను సాధారణంగా భోగో వర్ధన్ మఠం అని పిలుస్తారు. వివిధ సన్యాసుల సమూహాలు కలిసి ఉండటానికి ఆది శంకరాచార్యులు ద్వారా 8 వ శతాబ్దం లో స్థాపించబడింది. నాలుగు ప్రధానమైన వేదాలలో ఒకటిగా ఉంది. పూరి నగరంలో ఉన్న గోవర్ధన మఠం రుగ్వేదం బాధ్యత వహిస్తుంది. ఈ ఆశ్రమంలో జగన్నాథ్ (భైరవ) మరియు దేవి విమల (భైరవి) ప్రధాన దేవతలను పూజించుట వలన జగన్నాథ ఆలయం చారిత్రక మార్గములను కలిగి ఉంది.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

శ్రీ లోకనాథ్ ఆలయం

శ్రీ లోకనాథ్ ఆలయం పూరీ జగన్నాథ ఆలయం తర్వాత తదుపరి స్థానంలో ప్రజాదరణ పొందినది. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ ఆలయం నుండి కేవలం 3 కిమీ దూరంలో ఉంది. ఈ ఆలయం శివుడుకి అంకితం చేయబడింది. లార్డ్ శివ శని నుండి తప్పించుకొనుటకు ఇక్కడ ఉన్న చెరువు కింద దాక్కున్నారని చెప్పుతారు. ఈ ఆలయంలో లింగమును లార్డ్ రామచంద్ర ప్రతిష్ట చేసారని విశ్వసిస్తున్నారు. పక్కనే పార్వతి ట్యాంక్ యొక్క సహజ సిద్ద చిన్న చతురస్రాకార కంటైనర్ కలిగి ఉన్నది. ఈ శివలింగం ఎప్పుడూ నీటిలో ఉంటుంది.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

మౌసిమ ఆలయం

మౌసిమ ఆలయం జగన్నాథ ఆలయం మరియు పూరీ గ్రాండ్ రోడ్ లో ఉన్న గుండిచ ఆలయం మధ్యలో ఉంది. దేవత మౌసిమ లార్డ్ జగన్నాథ్ అత్త తల్లి యొక్క సోదరిగా సుపరిచితురాలు. వరదలు వచ్చినప్పుడు సగం సముద్ర నీరు నగరంను తాకినప్పుడు ఈ దేవత పూరీని సేవ్ చేసిందని నమ్మకం. ఆమె కపల్మోచన శివ పాటు పూరీ లో రాత్రి ,పగలు కాపలా కాస్తుందని నమ్ముతారు.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ చేరుకోవడం ఎలా

పూరీ విమాన, రోడ్డు మరియు రైలు మార్గాలతో అనుసంధానం చేయబడివుంది. పూరీ సందర్శించడానికి ఉత్తమ సమయం ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుండి మార్చి వరకు ఉంటుంది.

PC:youtube

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

రోడ్డు మార్గం

పూరీ బాగా సంరక్షించిన రోడ్డు సౌకర్యం ఉంది. రాష్ట్ర సొంత బస్సులు మరియు ప్రైవేటు బస్సులు ఒడిషా లో అన్ని ప్రధాన ప్రదేశాలకు అలాగే కోలకతా నుండి అందుబాటులో ఉన్నాయి. ఒరిస్సా పర్యాటక అభివృద్ధి సంస్థ (OTDC) నుండి డీలక్స్ బస్సులను దృశ్య వీక్షణం మరియు పూరీ ఇతర పర్యాటక కార్యకలాపాల కోసం ఉన్నాయి.

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

రైలు మార్గం

పూరీలో ఒక రైల్వే స్టేషన్ ఉంది. నేరుగా రైలు సేవలు పూరీ నుంచి కోలకతా,న్యూ ఢిల్లీ,గౌహతి, బెంగుళూర్,చెన్నై మొదలైన నగరాలు మరియు అనేక ముఖ్యమైన ఒడిషా ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయి.

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

విమాన మార్గం

సమీప విమానాశ్రయం భువనేశ్వర్ లో ఉంది. పూరీ నుండి కేవలం 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్ నుంచి పూరీ చేరటానికి ఒక గంట ప్రయాణం పడుతుంది. భువనేశ్వర్ విమానాశ్రయం భారతదేశం మరియు ఒరిస్సా యొక్క ఇతరు ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. బస్సులు టాక్సీలు విమానాశ్రయం నుండి పూరీకి అందుబాటులో ఉన్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+