ఇపుడైతే శబరిమల వెళ్లిరావటం నీళ్లు తాగినంత ఈజీ. కానీ ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. అప్పట్లో శబరిమల వెళ్ళటానికి ఎరుమేలిమార్గం అనే ఒక్క దారినే ఉపయోగించేవారట. ఈ దారి గుండానే పూజారులు, సిబ్బంది ఆలయానికి వెళ్లివచ్చేవారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు. వీరు ఎప్పుడువెళ్ళినా గుంపులు గుంపులుగా, బృందంగా వెళ్లేవారట. శబరిమల పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్ళటం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు.
రెండువందల సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్ర కు వెళ్లారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని రికార్డ్ లలో పేర్కొనబడింది. 1907 లో శబరిమల గర్భగుడి పైకప్పు ఎండుగడ్డితో, ఆకులతో కప్పబడివుండేది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు. 1909 లో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
టాప్ 3 ఆర్టికల్స్ కోసం కింద చూడండి

1909-10 వ సంవత్సరం
దేవాలయాన్ని మరలా 1909-10 వ సంవత్సరంలో పునఃనిర్మించారని తెలుస్తుంది. అప్పుడు శిలా విగ్రహానికి బదులు, పంచలోహాలతో తయారుచేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు.
సాంప్రదాయక నాట్యాలు - ఆదరణ కరువైన కళాకారులు!

భక్తుల సంఖ్య
అప్పటి నుండి పంచలోహ విగ్రహానికె పూజలు చేస్తుండటం గమనార్హం. 1935 తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకూండా మండల పూజ కొరకు కూడా భక్తులను లోనికి ఆహ్వానించారు.
రంగులు మారే కేరళపురం వినాయగర్ ఆలయం !
PC: telugu native planet

వడిపెరియారు మార్గం
చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది.
పది అంశాలలో ప్రసిద్ధ కేరళ !
PC:gallery.oneindia.com

ఆలయ ద్వారాలు
కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక విషు, పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగల సమయాలలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు 1945 వ సంవత్సరంలో ఆలయ బోర్డు తీర్మానించింది.
PC:Aruna

దపండితుల మంత్రోచ్చారణ ల మధ్య
1950 వరకు పరుశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతైంది. మరలా 1951 లో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య ప్రతిష్టించారు.
బాహుబలి 2 షూటింగ్ ప్రదేశాలు !!
PC:AnjanaMenon

భూతళీకేళీ విగ్రహం
అప్పటి వరకు కేరళీ కేళీవిగ్రహంగా కిర్తించబడ్డ అయ్యప్ప స్వామి భారతీకాళీ విగ్రహంగా, నేడు భూతళీకేళీ విగ్రహం గా కీర్తించబడుతున్నది.
అందుకోండి అందరికి ఆయుర్వేద టూర్ !
PC:Jaya jaya

స్వర్ణ దేవాలయం
బెంగళూరు భక్తుడొకాయన గర్భగుడి పైన, దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకోవడటంతో 2000 వ సంవత్సరంలో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారిపోయింది.
అన్ని కాలాల పర్యటనకు అనువైన కేరళ!
PC:ragesh ev

కొబ్బరికాయ
1984 కు పూర్వం పదునెట్టాంబడి ఎక్కటానికి భక్తులు పరుశురామ నిర్మితమైన రాతిమెట్లనే వాడేవారు. మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్లుపై కొబ్బరికాయను కొట్టేవారు.
భారతదేశంలో ఉన్నా సందర్శించకూడని ప్రదేశాలు !!
PC:Challiyan

పంచలోహ కవచం
దాంతో భక్తులు మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు. ఇది దృష్టిలో పెట్టుకొని బోర్డు వారు 1985 లో పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పేశారు.
PC:gallery.oneindia.com

మకరసంక్రాంతి
స్వామి వారి ఆభరణాలను పందళం లో భద్రపరిచి ఉంచుతారు. అక్కడి నుండి ప్రతి ఏటా మకరసంక్రాంతి తారీఖున మూడు పెట్టలలో భద్రపరిచిన ఆ ఆభరణాలను 11 మంది మూడురోజుల పాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల చేరవేస్తారు.
వాస్కో డ గామా మొట్టమొదట కాలుమోపిన ప్రదేశం !!
PC:sreenisreedharan

పొన్నంబలమేడు
తెచ్చిన ఆభరణాలను స్వామి వారికి అలంకరించి, కర్పూరహారతి గుళ్లో ఇవ్వగానే తూర్పుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది.
కేరళలోని గురువాయూర్ లో గల ప్రముఖ ప్రదేశాలు !!

పందళం
ఆభరణాల వెంట పందళం రాజ వంశస్థులలో ఒకరు(పెద్దవాడు) కత్తి పట్టుకుంటూ నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరిగి జనవరి 20 వ తేదీన ఆభరణాలను వెంట పందళం వరకు వెళ్లి వాటిని చేరవేరుస్తాడు.
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ... కుమారకోమ్ !

ధ్వజస్థంభం
శబరిమల ధ్వజస్థంభంపై గుర్రపు బొమ్మలకు ఒక పరమార్ధ తత్వము గలదు.
సౌత్ ఇండియాలో దాగున్న సమ్మర్ ప్రదేశాలు !
PC:youtube

తురగ వాహన ప్రియుడు
స్వామివారు తురగ వాహన ప్రియుడు. దీనిని వాజి వాహనము అని కూడా అంటారు.
కొల్లాం : జీడిపప్పుల నగరానికి ప్రయాణం !
PC:youtube

శ్రీ అయ్యప్పస్వామి వారు
శ్రీ అయ్యప్పస్వామి వారు రాత్రిపూటల ఈ హయామునెక్కి పరిసరప్రాంతమంతయూ తిరిగి ద్రుష్ట గ్రహములు ఆయా గ్రామములందు ప్రవేశించకుండా కాపలాకాస్తారట.
ఇడుక్కి పర్యటన .. అదుర్స్ !!
PC:youtube

శబరి
అయ్యప్ప స్వామివారు తెల్లని అశ్వమెక్కి వనప్రాంతమంతయూ తిరుగుతూ నడిచివచ్చే తన భక్తులకు వన్యమృగములచే, దుష్టగ్రహములచే ఎట్టి ఆపదలూ కలగనీయక అదృశ్యరూపుడై వారిని శబరికి చేరుస్తాడట.
తిరువళ్ళ......ఆలయాల ఊరు
PC:youtube

హరివారాసనం
దీనినే హరివారాసనం పాటలో తురగవాసనం స్వామీ సుందరాసనం అని వర్ణించియున్నారు.
కొచ్చిన్... అరేబియా సముద్రపు రాణి
PC:youtube
- వచ్చే పదేళ్లలో కాకినాడ, భీమవరం, పాలకొల్లు సముద్రంలో మునిగిపోతాయా ?
- గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
- గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !



Click it and Unblock the Notifications














