మహారాష్ట్ర రాష్ట్రంలోనే కాక భారత దేశ చరిత్రలోనే పూనే ప్రత్యేకత సంతరించుకొన్న నగరం. మరాఠాల థీరత్వానికి ప్రతీక. ముఖ్యంగా శివాజీ పాలనలో ఈ పూనే సర్వతోముఖంగా అభివద్ధి చెందింది. అనేక కోటలు, ఉధ్యానవనాలు నిర్మించబడ్డాయి. అంతకు ముందు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు కూడా పూనేలో అనేక దేవాలయాలను నిర్మించారు.
ఇక స్వాతంత్ర సంగ్రామంలో ఈ పూనే లో కొంత కాలం మహాత్మాగాంధీతో పాటు అనేక మంది నాయకులను బంధించారు. ఇలా చారిత్రాత్మకంగానే కాకుండా ధార్మిక కేంద్రంగా కూడా పూనే ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో పూణేలో చూడవల్సిన ప్రసిద్ది ప్రదేశాల్లో ఒకటి పాతాళేశ్వర గుహాలయం. ఈ పాతాళేశ్వర గుహాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పాతాళేశ్వర్ ఒక గుహాలయం.
పాతాళేశ్వర్ ఒక గుహాలయం. ఇది ప్రముఖ శివాలయం కూడా. ప్రస్తుతం పురావస్తు శాఖ ఆదీనంలో ఉంది. రాష్ట్రకూటల కాలంలో కొండను తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు.
పాతాళేశ్వర్ గుహ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించబడినది.
ఈ పాతాళేశ్వర్ గుహ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించబడినది. ఈ దేవాలయంలో శివుడు ప్రధాన దేవుడు. ఇప్పటికీ ఈ దేవాలయంలోని శివలింగానికి పూజలు జరుగుతున్నాయి. శివలింగం ముందు ఉన్న మంటపంలో ఉన్న నంది విగ్రహం విలక్షణంగా ఉంటుంది.
Dcrocks11
నంది తోపాటు ఇతర దేవాతా మూర్తులు విగ్రహాలు కూడా
నంది తోపాటు ఇతర దేవాతా మూర్తులు విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ గుహాలయంలోని శివుడిని పాతాళేశ్వర్ అని పిలుస్తారు. ఎందుకుంటే ఈఆలయంలో శివుడు భూగర్భంలో లేదా నేలమీద ఉండటం వల్ల అలా పిలవబడుతున్నాడు. ఇక్కడ కనిపించే ప్రతి శిల్ప ఏదో చెప్పటానికి నిశ్శబ్దంగా ఉన్నట్లు కనబడుతాయి.
దాదాపు 1400ఏళ్ళ క్రితం నాటి ఈ పాతాళేశ్వర్ గుహాలయం పూణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్ లో
ఈ పాతాళేశ్వర్ దేవాలయం 8వ శతాబ్దానికి చెందినది. దాదాపు 1400ఏళ్ళ క్రితం నాటి ఈ పాతాళేశ్వర్ గుహాలయం పూణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్ లో ఉంది. పాతాలలోకపు దేవుడు కాబట్టి ఈ గుడికి పాతాళేశ్వర్ దేవాలయం అనే పేరు వచ్చింది. నిర్మాణ శైలిలో ఈ గుడి ఎలిఫెంటా గుహలను ఎల్లోరా గుహలను పోలి ఉంటుంది.
ఈ గుహాలయంలో లిఖించిన కొన్ని శాసనాలు
ఈ గుహాలయంలో లిఖించిన కొన్ని శాసనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. కొన్ని నిర్మాణాలు బౌద్ధ శైలి నిర్మాణాలను పోలి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తాయి.
ఏ కళాఖండాలు అనూహ్యంగా
ఏ కళాఖండాలు అనూహ్యంగా ప్రారంభించబడ్డాయి కానీ పూర్తవుతున్నాయన్న వాస్తవం చాలా మంది పురావస్తు శాస్త్రజ్ఞులు పూర్తిగా అర్థం చేసుకోలేరు అనే వాస్తవం నిజం.
రాతి గుహలోని గర్భగుడిలో శివ లింగం
ఈ దేవాలయంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దీన్ని ఒకే ఒక పెద్ద రాయి నుండి తొలిచారు. ఈ గుహాలయంలో శివలింగాన్ని కూడా చూడవచ్చు. రాతి గుహలోని గర్భగుడిలో శివ లింగం, ఇరువైపులా ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. శివుడి విగ్రహానికి ఎడమ చేతి వైపు రామ, సీత, లక్ష్మణాల యొక్క విగ్రహాల అద్భుతంగా ఆకర్షిస్తాయి. నల్లబల్లపై నిలబడి భంగిమలో ఉన్న ఈ విగ్రహాలపై అద్భుతంగా సూర్య కిరణాలను ప్రకాశిస్తాయి.
విగ్రహాలు నిలబడి ఉండటం ఒక రహస్యంగా ఉంది.
సుదీర్ఘకాలం ఛాతీ సెడాసీగా నిలుస్తున్న గుహ ఆలయం ఇకపై ఇక్కడ ఎక్కువగా పేర్కొనలేదు. బౌద్ధమత శైలి హిందూ శైలిలో నిర్మించారు. అంతేకాక ఈ ఆలయంలో విగ్రహాలు నిలబడి ఉండటం ఒక రహస్యంగా ఉంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి మహారాష్ట్ర పూణే లోని పాతాళేశ్వర్ ఆలయం ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న శివాజి నరగంలో ఉండే ఈ దేవాలయం నగరం యొక్క సాంప్రదాయిక వారసత్వం కలిగినది. ఈ గుడిని వారంలో అన్ని రోజులో ఉదయం 8గంటల నుండి సాయంత్రం 5.30 దాకా దర్శించుకోవచ్చు.
పూణే సందర్శించే పర్యాటకలు తప్పక సందర్శించవల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి పాతాళేశ్వర్ గుహ దేవాలయం
పూణే సందర్శించే పర్యాటకలు తప్పక సందర్శించవల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి పాతాళేశ్వర్ గుహ దేవాలయం.జంగ్లి మహరాజ్ రోడ్ లో ఉండే ఈ దేవాలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం మరియు రైలు సౌకర్యం ఉంది. బస్ స్టాండ్ నుండి మరియు రైల్వే స్టేషన్ల నుండి అద్దెకార్లు, మరియు రిక్షాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.