పట్టడకాల్ కు ఒక్కసారి ప్రయాణం చేస్తేచాలు, దక్షిణ భారత దేశంలో చాళుక్యుల పాలనా కాలంనాటి వైభవం చూసినవారం అవుతాము. పట్టడకాల్ అంటే అర్ధం 'కెంపుల కిరీట నగరం' అని చెపుతారు. చాళుక్యుల పాలనాకాలంలో ఈ నగరం వైభవంతో తులతూగేది. పట్టడకాల్ పట్టణం మాలప్రభ నది పై బాగల్ కోట జిల్లాలో ఉంది.
ఇది కూడా చదవండి : 25 KM ల దూరంలో ఉన్న బాదామి సందర్శనీయ స్థలాలు !
ఒకప్పుడు ఈ పట్టణంలో రాజులు నివసించేవారు. ఈ పట్టణం తొమ్మిది హిందూ దేవాలయాలకు, ఒక జైన మందిరానికి ప్రసిద్ధి. వీటిని చాళుక్య రాజులు క్రీ. శ. 7వ మరియు క్రీ. శ. 8వ శతాబ్దాలలో నిర్మించారు. ఈ దేవాలయాల శిల్పకళా వైభవం అద్భుతంగా ఉండి, ఈ ప్రదేశం అంతా కూడా ప్రపంచ హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తించింది.
ఇది కూడా చదవండి : 13 KM ల దూరంలో ఉన్న ఐహోళే సందర్శనీయ స్థలాలు !
పట్టడకాల్ దేవాలయాలలో అద్భుతమైన ఉత్తర మరియు దక్షిణ భారత దేశ ప్రాంతాల శిల్ప కళా శైలి గోచరిస్తుంది. ఈ రెండు శైలుల కలయికే విరూపాక్ష దేవాలయం. ఈ దేవాలయాన్ని క్రీ. శ. 740 సంవత్సరంలో రాణి లకుమాదేవి నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. పల్లవ రాజులపై తన భర్త రెండవ విక్రమాదిత్యుడి ఘన విజయానికిగాను ఆమె ఈ దేవాలయం నిర్మించింది.
గల్గనాధ దేవాలయం, పట్టడక్కాల్
గల్గనాధ దేవాలయం క్రీ. శ. 8వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం ఆవరణలో ప్రవేశించిన భక్తులు సుఖానస మరియు నవరంగ, మరియు ఒక శివలింగాన్ని చూడవచ్చు. గర్భగృహం చుట్టూ ఉన్న ప్రాంగణం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రాంగణం వెలుపలి భాగంలో గోడలపై వివిధ రకాల చిత్రాలు చూడవచ్చు.
చిత్ర కృప : Mukul Banerjee
మల్లిఖార్జున దేవాలయం
మల్లిఖార్జున దేవాలయం క్రీ. శ. 7వ శతాబ్రదంలో త్రైలోక్య మహాదేవి నిర్మించింది.. దీని నిర్మాణ శైలి ద్రవిడ శిల్ప కళా శైలి కలిగి ఉంటుంది. మండప స్తంభాలకు పురాణాలు, ఇతిహాసాలలోని ప్రధాన సంఘటనలు చెక్కబడ్డాయి. ఈ దేవాలయంలోని నంది మండపం మరో ప్రధాన ఆకర్షణ.
చిత్ర కృప : G41rn8
జైన మందిరం
స్ధానికంగా ఈ జైన మందిరాన్ని 'జైన నారాయణ' అని కూడా పిలుస్తారు. దీనిని క్రీ. శ. 9వ శతాబ్దంలో మన్య ఖేతకు చెందిన రాష్ట్ర కూటులు నిర్మాణం చేశారు. వీరు తమ నిర్మాణాలలో ద్రవిడ శైలి కళా చెక్కడాలను చేశారు. ఈ జైన దేవాలయం ఎంతో పటిష్టమైనదిగా అతి పెద్ద బలమైన రాళ్ళతో కట్టబడింది. పర్యాటకులు ఈ ప్రాంత సందర్శనలో దీనిని తప్పక చూడాలి.
చిత్ర కృప : Dineshkannambadi
జంబులింగేశ్వర దేవాలయం
జంబులింగేశ్వర దేవాలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించారు. ఇది ఒక ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంలోకి ప్రవేశించగానే భక్తులు మాత పార్వతిని, శివ భగవానుడిని, నందిని దర్శిస్తారు.
చిత్ర కృప : G41rn8
కాడ సిద్ధేశ్వర దేవాలయం
కాడ సిద్ధేశ్వర దేవాలయం సుమారు క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించబడింది. క్రిందిభాగం అయిదు దంతులు వేసి ఎత్తుగా నిర్మించారు. ఈ దేవాలయం లో శివుడు ఒక చేతిలో తన త్రిశూలాన్ని ధరించి దర్శనమిస్తాడు. పర్యాటకులు ఈ దేవాలయాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా వస్తారు.
చిత్ర కృప : Ismoon
పాపానాధ దేవాలయం
పాపానాధ దేవాలయం, ముక్తేశ్వరుడి కొరకు నిర్మించబడిని చిన్న దేవాలయం. ఈ నిర్మాణం సుమారు క్రీ.శ. 740 సంవత్సరంలో చేశారు. హాలు లోపలిభాగ ప్రవేశంలో నంది మరియు వీరభద్ర విగ్రహాలుంటాయి. పర్యాటకులు ఈ దేవాలయంలో మంటపానికి ఆధారంగా కల 16 అతి పెద్ద స్తంభాలను కూడా గమనించవచ్చు.
చిత్ర కృప : Meesanjay
సంగమేశ్వర దేవాలయం
సంగమేశ్వర దేవాలయాన్ని గతంలో విజయేశ్వర దేవాలయం అనేవారు. దీనిని చాళుక్య రాజు విజయాదిత్య సత్యశ్రయ సర్కా క్రీ. శ. 733 లో నిర్మించాడు. ఈ నిర్మాణం ద్రవిడ శిల్ప శైలి కలిగి ఉంటుంది. లోపలి ప్రాకారం, హాల్, కలవు. బయటి ప్రాకారం ఉగ్రనరసింహ మరియు నటరాజ శిల్పాలను కలిగి ఉంటుంది.
చిత్ర కృప : Manjunath nikt
విరూపాక్ష దేవాలయం
దేవాలయాన్ని సర్కి క్రీ. శ. 740 లో రాణి లోకమహాదేవి తన భర్త విక్రమాదిత్య 2 పల్లవులను ఓడించిన గుర్తుగా నిర్మించారు. దీనిని క్రీ. శ. 8వ శతాబ్దంలో నిర్మించారు. దేవాలయంలో హిందూ దేవతలైన ఉగ్రనరసింహ, నటరాజ, రావణనుగ్రహ, లింగోద్భవులను శిల్పాలుగా చూడవచ్చు.
చిత్ర కృప : Mukul Banerjee
శిల్పాల గ్యాలరీ మ్యూజియం
పట్టడకాల్ లో వివిధ దేవాలయాలను దర్శించిన యాత్రికులు భూతనాధ దేవాలయం రోడ్డులో కల శిల్పాల మ్యూజియం కూడా చూడాలి. ఈ మ్యూజియంను భారత దేశ పురావస్తు శాఖ నిర్విస్తోంది. ఈ మ్యూజియంలో అరుదైన శిల్పాలు, చెక్కడాలు అతి ప్రాచీనమైనవి చూడవచ్చు.
చిత్ర కృప : Ashwin Kumar
పట్టడక్కాల్ ఎలా చేరుకోవాలి ?
బస్ / రోడ్డు ప్రయాణం : పర్యాటకులు బాదామి, ఐహోళే, భాగల్ కోట తదితర సమీప ప్రాంతాల నుండి పట్టడక్కాల్ చేరుకోవచ్చు.
రైలు మార్గం : పట్టడక్కాల్ సమీపాన బాదామి రైల్వే స్టాలోన్ కలదు (25 km).
విమాన మార్గం : బెల్గాం విమానాశ్రయం పట్టడక్కాల్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం (205 కి.మీ).
చిత్ర కృప : Ashwin Kumar