ఐహోళే పర్యాటక ప్రదేశంలోని రాతి శిల్పాలు సామాన్యులను మరియు పురావస్తు శాస్త్రవేత్తలను కూడా అబ్బుర పరుస్తాయి. ఈ పట్టణంలో చాళుక్యులచే నిర్మించబడిన అనేక దేవాలయాలున్నాయి. వాస్తవానికి ఈ దేవాలయాలు చాళుక్యుల శిల్పకళా నైపుణ్యాలను చాటుతూంటాయి. ఐహోళే లోని ఈ దేవాలయాల కళా వైభవం చాళుక్య రాజులు కళల కొరకు చేసిన తీవ్రమైన కృషిని చాటుతాయి.
ఐహోళే పట్టణ ఇతిహాస చరిత్ర
ఐహోళే పట్టణం చాళుక్యుల మొదటి రాజధానిగా ఉండేది. మలప్రభ నది ఒడ్డున గల ఈ పట్టణం అనేక ఇతిహాస చరిత్రలు కలిగి ఉంది. వాటిలో ఒకటి యుద్ధ బ్రాహ్మణ యోధుడు పరశురాముడు ఈ ప్రాంతంలో నివసించాడనేది. పరశురాముడు తాను శత్రువులుగా భావించే ప్రధాన క్షత్రియ రాజులను వధించిన తర్వాత ఈ ప్రదేశానికి వచ్చి రక్తం ఓడుతున్న తన గొడ్డలి ఆయుధాన్ని మాలప్రభ నదిలో కడిగి శుభ్ర పరచుకుంటాడనేది ఒకటి. పరశురాముడు కడిగిన ఆ గండ్ర గొడ్డలికిగల రక్తం నది నీటిని సైతం ఎర్రగా మార్చేసినట్లు చెపుతారు. ఈ సందర్భంగానే ఈ ప్రదేశానికి ఐహోళే ...అంటే...ఆహా..ఏమి నది? అని అర్ధం వచ్చిందని చెపుతారు.
ఐహోళే దేనికి ప్రసిద్ధి? ఐహోళే ప్రాంతంలో షుమారుగా 125 చాళుక్య దేవాలయాలున్నాయి. వీటిలో లడ్ ఖాన్ దేవాలయం అతి ప్రాచీనమైనదని 5వ శతాబ్దానికి చెందిందని తెలుస్తోంది. ఈ ప్రదేశంలోని ప్రముఖ దేవాలయాలలో గౌడా దేవాలయం, సూర్యనారాయణ దేవాలయం, దుర్గ దేవాలయంలు ప్రసిద్ది. రావణ ఫాడి గుహ అతి ప్రాచీన కొండగుహ. ఐహోళే లో లభ్యమైన శాసనాలు చరిత్ర గతిని కూడా గుర్తించటానికి తోడ్పడ్డాయి. ఈ స్ధలం బెంగుళూరుకు 483 కిలోమీటర్ల దూరంలో ఉండి చక్కటి రోడ్డు మార్గం కూడా కలిగి ఉంది. దీనికి సమీప రైలు స్టేషన్ బాదామి.