జైన్ మేగుటి దేవాలయం గలగనాధ గ్రూపు దేవాలయాలకు సంబంధించినది. ఇది ఐహోళే కొండ పై ఒక ఎత్తైన ప్రదేశంలో కలదు. దేవాలయంలో కల శాసనాల మేరకు, ఈ గుడి సుమారు క్రీ.శ. 634 సంవత్సరంలో పులకేశి సైన్యాధిపతి రవికీర్తిచే నిర్మించబడింది. గుడి అసంపూర్తిగా ున్నప్పటికి దేవాలయ చెక్కడాలు చాలా అందంగా చేశారు.
ఈ దేవాలయంలో కూర్చుని ఉన్న భంగిమలో మహావీరుడి విగ్రహం మరియు కొంత దెబ్బతిన్న, అయినప్పటికి అందంగా ఉన్న అంబికా మాత విగ్రహాలు కూడా కనపడతాయి. ఈ దేవాలయాన్ని సున్నం పెట్టి కట్టకపోవడంతో చాలావరకు ధ్వంసం అయింది. అయినప్పటికి ద్రవిడ శైలి శిల్పాలు కనపడతాయి.
ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఉన్న 100 చిన్న గుళ్ళను చూచేందుకైనా సరే పర్యాటకులు తప్పక ఇక్కడకు రావాలి. మొదటిలో ఈ దేవాలయానికి పెద్ద స్తంభాలుకల ముఖ మంటపం ఉండేది. తర్వాతి కాలంలో ఇతర కట్టడాలతో పునరుద్ధరించారు.