Search
  • Follow NativePlanet
Share
» »ఆంజనేయుడు జీవించేవున్నాడు అనేదానికి ఇదే సాక్షి...

ఆంజనేయుడు జీవించేవున్నాడు అనేదానికి ఇదే సాక్షి...

హనుమంతుడు హిందూ గ్రంథాలలో రామాయణంలో అత్యంత ముఖ్యమైన పాత్రలలో ఒకటి.ఇతను హిందూదేవతైనా భారతదేశంలోనేకాకుండా ఇతరదేశాలలో కూడా అపారభక్తిని కలిగివున్నారు.

By Venkatakarunasri

హనుమంతుడు హిందూ గ్రంథాలలో రామాయణంలో అత్యంత ముఖ్యమైన పాత్రలలో ఒకటి.ఇతను హిందూదేవతైనా భారతదేశంలోనేకాకుండా ఇతరదేశాలలో కూడా అపారభక్తిని కలిగివున్నారు. ఇతనిని వాయుపుత్రుడు, కపివీరుడు, అంజనాదేవి కుమారుడు, రాముని పరమభక్తుడు అని అనేక పేర్లతో పిలుస్తారు. హనుమంతుణ్ణి శక్తిదేవత అని పిలుస్తారు.భారతద్యాంతాల్లో హనుమంతునికి అనేకదేవాలయాలను మనం చూడవచ్చును.

హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకడు.మహా బ్రహ్మచారి, అద్వితీయ పండితుడు, మహామేధావి.ఇతని స్వామినిష్ఠకి తగిన పేరు హనుమంతుడు.రాజస్థాన్ లో బాలాజి అనేపేరుతో ఇతనికి ఒక మహిమాన్వితమైన దేవాలయముంది.ఆ దేవాలయంలో స్వతాహా స్వామే భూత, ప్రేతాలను ఓడిస్తాడంట.అదేవిధంగా ఈ వ్యాసంలో ఆంజనేయస్వామి జీవించేవున్నాడు అనే దానికి ఈ దేవాలయమే నిదర్శనం.

అట్లయితే ఆ దేవాలయం ఏది? ఆ దేవాలయం ఎక్కడుంది?అనే దానిని సంక్షిప్తంగా వ్యాసం మూలంగా తెలుసుకుందాం.

ఆంజనేయుడు జీవించేవున్నాడు అనేదానికి ఇదే సాక్షి...

ఆంజనేయుడు జీవించేవున్నాడు అనేదానికి ఇదే సాక్షి...

రామేశ్వరం తమిళనాడులోని రామనాథపురం అనే జిల్లాలోవుంది. ఇది పంబన్ ద్వీపం సమీపంలో వుంది.అక్కడ ఒక పర్వతంలో ఆంజనేయస్వామి వెలసియున్నాడు. ఆంజనేయస్వామి అప్పుడప్పుడు ఈ దేవాలయానికి వస్తూవుంటాడు అని నమ్ముతారు. ఇదొక మహిమాన్వితమైన దేవాలయం అని భావిస్తారు. కొంతమంది ఇక్కడి ఆంజనేయస్వామిని ప్రత్యక్షంగా చూసామని కూడా చెప్తారు. 21వ శతాబ్దంలో వున్నా కూడా దీనిని నమ్మాలాఅని అనుమానపడితే అంటే, ఇక్కడి హనుమంతుడు వచ్చేది నిజం అని అక్కడి ప్రజలు వాదిస్తారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఈ శక్తివంతమైన పర్వతం రామేశ్వరంనుంచి కేవలం 3కిమీ దూరంలో వుంది. ద్వీపం యొక్క పశ్చిమ సరిహద్దులో నాశనంకాబడిన ధనుష్కోడి నగరానికి వెళ్ళే మార్గంలో ఉంది.రామేశ్వరానికి సమీపంలో వున్న ఈ దేవాలయానికి సులభంగా చేరుకోవచ్చును.

గంధమాత మలై దేవాలయం

గంధమాత మలై దేవాలయం

ఇంతకీ ఆ దేవాలయం పేరు గంధమాత మలై దేవాలయం.ఇదే స్థలంలో ఆంజనేయస్వామి లంకకి దారిచేసుకునెను అని నమ్ముతారు.రాముని భక్తుడైన ఆంజనేయస్వామి తన భక్తినిష్ఠలని చూపించి సులువుగా తన యదని చీలచుకొనుట ఇక్కడ చూడవచ్చును.

ప్రయాణం(ప్లాన్)

ప్రయాణం(ప్లాన్)

మీరు ప్రతి పర్యటనలో సరిగ్గా ప్లాన్ చేయాలి.సమయమే కాని డబ్బేకాని ఏవిధంగా వుపయోగించాలి అని ముందే ఆలోచిస్తే మంచిది.చెన్నైనుంచి రామేశ్వరానికి ఎలా వెళ్ళాలి అనేదాన్ని ఇక్కడి పోస్ట్ మూలంగా చూడవచ్చును.

ఇక్కడికి ఎలా వెళ్ళాలి?

ఇక్కడికి ఎలా వెళ్ళాలి?

ఇక్కడ శృంగారాలను ప్రోత్సహించే కొన్ని బీచ్లు మరియు గమ్యస్థానాలు ఉన్నాయి. గోవాలోని ప్రసిద్ధ మైన ఈ వేల్స్ బీచ్, సిరిడా బీచ్, లవర్స్ బీచ్, హాలండ్ బీచ్, బటర్ ఫ్లై బీచ్, వాగెర్టెర్ బీచ్ మరియు అశ్వం బీచ్ లను కూడా ఒక్కసారి సందర్శించిరండి.

చెన్నై-రామేశ్వరం

చెన్నై-రామేశ్వరం

రామేశ్వరం నుండి చెన్నైకి 11 గంటల దూరంలో ఉంది.స్వంతవాహనాలు వుంటే కేవలం 2గంలకన్నా తక్కువసమయంలో ఇక్కడికి చేరవచ్చు.దారిలో మెల్మరువత్తూర్, అరియాలూర్, త్రిచి మరియు శివగంగై వంటి వివిధ స్థలాలను పర్యాటకులు సందర్శించవచ్చు.రామేశ్వరంలో చాలా పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ఆంజనేయస్వామి నివసించిన స్థలాన్ని మొదటచూద్దాము.

రామేశ్వరం-ఆంజనేయ స్వామి నివసించిన స్థలం

రామేశ్వరం-ఆంజనేయ స్వామి నివసించిన స్థలం

ఆంజనేయ స్వామి నివసించిన ప్రదేశం ఇక్కడ దేవాలయంవుంది. ఆ దేవాలయాన్ని రామశరోఘ అని పిలుస్తారు.ఇదొక పర్వతప్రదేశమైనా, 3కిమీ కాలు నడకలో వెళ్ళవలసివుంటుంది.,ఈ దేవాలయానికి అనేకమంది భక్తులు మరియు పర్యాటకులు సందర్శిస్తారు.

రామ శురిక దేవాలయం

రామ శురిక దేవాలయం

రామ శురిక దేవాలయం రామపదంలో కలదు. రామేశ్వరం నుంచి దేవాలయానికి వెళ్ళే మార్గంలో అనేక గోపురాలు మరియు దేవాలయాలు చూడవచ్చు.

మార్గమధ్యంలో దొరికే దేవాలయాలు

మార్గమధ్యంలో దొరికే దేవాలయాలు

దారిలో అనేక ప్రముఖమైన దేవాలయాలను చూడవచ్చును. వాటిలో పిళ్ళయర్ దేవాలయం, సుక్రీవర్ తీర్థం, అమ్మన్ దేవాలయం, అంగాధ తీర్థం, జంబవన్ తీర్థం, శకి హనుమాన్ దేవాలయం మరియు రామపాదం దేవాలయం ఉన్నాయి.

కున్నాంఠాన పర్వతం

కున్నాంఠాన పర్వతం

కున్నాంఠాన పర్వతం చాలా అందమైన వుంటుంది.రామేశ్వరంలో వుండేవారు అప్పుడప్పుడు ఈ కొండకి వస్తూనేవుంటారు.ఈ పర్వతంలో రామపదం అనే ఆలయంవుంది.ఈ పర్వతంమీద అద్భుతమైన సూర్యోదయం మరియు సూర్యాస్తమయాలదృశ్యాలుచూడవచ్చును

సుగ్రీవర్ తీర్థం

సుగ్రీవర్ తీర్థం

ఈ దేవాలయానికి వెళ్ళే దారిలో మీరు సుగ్రీవర్ తీర్థాన్ని చూడవచ్చును. సుగ్రీవర్ దేవాలయం ఈ కొండకి సమీపంలోనే వుంది.ఈ కొండ నుంచి మొత్తం రామేశ్వరం చూడవచ్చు.అదేవిధంగా ఈ దేవాలయానికి అనేకమంది పర్యాటకులు వస్తూవుంటారు.

సమీపంలోని పర్యాటకప్రదేశాలు

సమీపంలోని పర్యాటకప్రదేశాలు

రామ తీర్థం, భీమ తీర్థం, అర్జున తీర్థం, కంధమంత తీర్థం, ధర్మ తీర్థం, వీర తీర్థం, పంచ తీర్థం, సహదేవ తీర్థం, పరాశురామ తీర్థం, కుముద తీర్థం మొదలైనవి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+