నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చే 'రాజర్శి' అనే నవలలో మరియు 'బిశర్జన్' అనే నాటకం లో భువనేశ్వరి ఆలయం సజీవం గా చిత్రింపబడింది. గోమతి నది ఒడ్డున శిధిలావస్థలో ఉన్న ఒక కోట వద్ద ఈ ఆలయం నెలకొని ఉంది.
భువనేశ్వరి దేవి కొలువై ఉన్న భువనేశ్వరి ఆలయం 17 వ శతాబ్దం లో మహారాజా గోవింద మాణిక్యల చేత నిర్మించబడింది. క్రీ.పూ.1660 నుండి 1675 ల మధ్యలో ఈ ఆలయం నిర్మించబడింది. అగర్తల రాజధానిగా మారక ముందు ఉదయపూర్ మాణిక్య రాజవంశీకులకు అధికార నివాసంగా ఉండటమే కాకుండా రాజధానిగా కూడా వ్యవహరించింది. ఈ ఆలయం మూడు అడుగుల మేర ఎత్తు కలిగిన వేదికపైన నిర్మించబడింది. నాలుగు భాగాల పైకప్పు, ప్రవేశ ద్వారం వద్ద స్తూపం, ఒక ప్రధాన గది ఈ ఆలయ నిర్మాణం లో ముఖ్యమైనవి. పుష్పం లా తీర్చిదిద్దబడిన మోటిఫ్లు ఈ ఆలయం స్తూపాలు ఇంకా స్థంబాల యొక్క ఆకర్షణలు.
త్రిపుర లో ని ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం కావడం వలన ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు.