ఉదయపూర్ లో ని ప్రసిద్ది చెందిన జాతీయ గ్రంధాలయం ఇది. ప్రఖ్యాత బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం పేరుతొ ఈ గ్రంధాలయం పేరు పొందింది. కలిపిత మరియు వాస్తవికత కు సంబంధించిన అనేకమైన గ్రంధాలకు ఈ గ్రంధాలయం స్థావరం.
మాణిక్య రాజవంశానికి చెందిన చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ గ్రంధాలయం నిలుస్తుంది. త్రిపుర కి చెందిన ప్రముఖమైన పుస్తకాలు ఇంకా సాహిత్యానికి ఈ గ్రంధాలయం స్థావరం. ఉదయపూర్ నుండి దూరం గా ఉన్నప్పటికీ, అగర్తల నుండి విసిరేసినట్టుగా ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో ప్రజలు ప్రత్యేకించి విద్యార్ధులు ఇక్కడికి తరచూ విచ్చేస్తారు.
స్థానిక సంస్కృతీ సంప్రదాయాలని తెలుసుకోవాలనుకునే పర్యాటకులకి ఈ ప్రదేశం అమూల్యమైనది. వేల సంఖ్యలో పుస్తకాలు కలిగిన ఈ జాతీయ గ్రంధాలయం తనదైన ప్రత్యేకత కలిగినది. ప్రఖ్యాత కవి పేరు తో ఈ గ్రంధాలయం ఏర్పాటు అయినందువల్ల అధిక సంఖ్యలో పుస్తకాలూ ఆయనకే అంకితమివ్వబడి ఉన్నాయి.