వారణాసి దేశంలో అన్ని ముఖ్యమైన మతాలు ముఖ్యంగా హిందూమతం, బౌద్ధమతం, జైనమతం, ఇస్లాం మతం సంస్కృతులను తెలిపే ఆలయాల నగరం. ఈ నగరం, దాని పరిసర ప్రాంతాలు సుపర్శావ్, చందప్రఫు, పర్శ్వనాథ్, శ్రేయస్, పార్శ్వ వంటి ఐదు జైన తీర్థంకరుల – సాదు బోధకుల స్థానిక ప్రదేశంగా గొప్పగా చెప్పుకుంటాయి.
జైన్ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో, వారణాసి లోని భేల్పూర్ వద్ద శ్రీ పార్శ్వనాథ్ దిగంబర్ జైన్ తీర్థ క్షేత్ర లో బనారస్ సైనిక క్షేత్రం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ ఆలయం జైనమత ఇరవై మూడవ తీర్దంకరుడైన పార్స్వనాద్ కి అంకితం చేయబడింది, ఈయన క్రీ.శ. 800 లో వారణాసిలో జన్మించాడు. ఈ అద్భుతమైన ఆలయ సందర్శన కళ్ళకు యదార్ధ స్థితిని అందిస్తుంది. దాని ప్రకాశవంతమైన బంగారు శిఖర౦ దూరం నుండి దృష్టిని ఆకర్షిస్తుంది.
భక్తులు ఈ ప్రాంతంలో ప్రవేశించి ఈ ఆలయాన్ని సందర్శి౦ఛి పరమానందకరమైన శాంతిని, ప్రశాంతతను పొందుతారు. అయినప్పటికీ ఈ ఆలయాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు, అయితే, జనవరి మొదటి వారంలో సందర్శించడం ఉత్తమం.