ఇది ఐదు పవిత్ర నదులు-గంగా, సరస్వతి, దుపపాప,యమునా మరియు కిరణ నదుల సంగమం వద్ద నిర్మించబడింది. అందుకే దీనికి పంచగంగ ఘాట్ అని పేరు వచ్చింది. ఈ ఐదింటిలో ఒక గంగ మాత్రమే కనపడుతుంది. మిగతా నాలుగు భూమిలో అదృశ్యమయ్యాయని నమ్ముతారు. ఈ పంచగంగ ఘాట్ వారణాసిలో అత్యంత పవిత్రమైన ఘాట్ లలో ఒకటిగా గుర్తించబడుతుంది.
అంతే కాకుండా పంచగంగ ఘాట్ మూడు చారిత్రక కారణాల కోసం కూడా ప్రసిద్ధి చెందింది.
1. సంత్ తుల్సి దాస్ ఈ ప్రదేశములో ఉన్న సమయంలోనే ప్రసిద్ధ రామాయణమును రాసేను.
2. అతి పెద్ద గురువు మరియు పండితుడు అయిన స్వామి రామానంద్ తన శిష్యులకు వేదాలను ఇక్కడ నేర్పారు.
3. మరాఠా నాయకుడు బెని మధుర్ రావు సిందియా నిర్మించి, పూజింపబడిన విష్ణు దేవాలయంను నాశనం చేసి మరియు దానికి బదులుగా మొఘల్ ఔరంగజేబు ఆలంగీర్ మసీదును నిర్మించాడు.



Click it and Unblock the Notifications