కనక దుర్గ ఆలయం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవిస్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.ఇక్కడే అర్జునుడు కి పాసుపత అస్త్రం ను శివుడు అనుగ్రహించాడు.పురాణాల ప్రకారం అమ్మవారి పేరు తోనే ఆలయంను నిర్మించారు.
ఆధునిక విజయవాడ కింగ్డమ్ ను కట్టించిన రాజు పూసపాటి మాధవ వర్మ, 12 వ శతాబ్దంలో నిర్మించారు అని ఒక కథ కూడా ఉంది. ఈ ఆలయంలో ప్రధాన పండుగలు సరస్వతి పూజ మరియు తెప్పోత్సవం జరుపుకుంటారు.ఈ ఆలయమునకు రైల్వే స్టేషన్,బస్ స్టేషన్ రెండు దగ్గరగానే ఉంటాయి.