ఉజ్జయంత భవన సముదాయంలో వున్న ఈ ఉమా మహేశ్వర దేవాలయం ఈ ప్రాంగణం లోని అనేక దేవాలయాల్లో ఒకటి. శైవ, శాక్త సాంప్రదాయాలకు చెందిన హిందూ దేవాలయం ఇది. ఉమా మహేశ్వర అనేది దుర్గాదేవికి ఇంకో పేరు.త్రిపురలోని చాలా ఆలయాల లాగే ఉమా మహేశ్వర దేవాలయం కూడా బెంగాల్ నిర్మాణ శైలిని పోలి వుంటుంది. ఈ దేవాలయం (బెంగాల్ లోని చాలా దేవాలయాల లాగే) కాషాయ రంగులో వుంటుంది. ఈ దేవాలయం నిర్మాణ శైలి చూస్తె హిందూ మతం తో ఇన్ని పోలికలు వున్న ఈశాన్య రాష్ట్రాలలోని ఏకైక దేవాలయం అనిపిస్తుంది.
అగర్తలా లోని అతి ప్రధానమైన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటైన ఉజ్జయంత భవనం ఈ గుడి నేపథ్యంలో కనపడుతుంది. ఇది ఈ దేవాలయం అందాన్ని హెచ్చిస్తుంది, ఈ గుడి కూడా ఈ నేపథ్యానికి అతికినట్టుగా సరిపోతుంది. ముందు వుండే పచ్చని మైదానాలు కూడా అందాన్ని ఇనుమడింప చేస్తాయి.