అల్మోర చేరే పర్యాటకులకు ట్రెక్కింగ్ తప్పక వుంటుంది. ఈప్రదేశం నుండి సుమారు 5 కి.మీ.ల దూరం అల్మోర పర్వత శ్రేణుల దృశ్యాలు కనపడతాయి. అల్మోర నుండి జగేస్వర్ కు మార్గం బాగుంటుంది. ఈ మార్గంలో ట్రెక్కర్లు కుమావొనీ గ్రామాల గుండా వెళతారు. ఈ ట్రెక్ లో జగేశ్వర్ టెంపుల్ కాంప్లెక్స్ మరియు వ్రిద్ జగేశ్వర్ లు ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ నుండి కాసర్ దేవి టెంపుల్ కూడా వెళ్ళవచ్చు. ట్రెక్కింగ్ కు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలం.
సాహసికులకు పిండారీ ట్రెక్ సూచించ దగినది. ఈ మార్గం అడవులు, లోయల గుండా వెళుతుంది. పిండారీ గ్లేసియర్ నంద దేవి మరియు నందాకోట్ పర్వతాల మధ్య కలదు.