అయోధ్య లో ని రామ్ కి పైరి లో ఉన్న ఈ ఆలయం పేరులో సూచించబడినట్టు నాగేశ్వర్నాథ్ మరియు నాగుల దైవం గా ప్రసిద్ది చెందినా మహా శివుడి కి అంకితమివ్వబడినది. ఈ ఆలయం గర్భగుడి లో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం ఉంది.
పురాణాల ప్రకారం ఒక రోజు శ్రీ రాముడి చిన్న కుమారుడైన కుశుడు సరయు నది లో స్నానం చేస్తుండగా బాహుపురి నీళ్ళలో పడిపోయింది. ఎంత వెతికినా అతనికి దొరకలేదు. చివరగా మహా శివుడి భక్తుడైన ఒక సర్పం కుమార్తె అయిన నాగ కన్య ద్వారా ఆటను తిరిగి బాహుపురి ని దక్కించుకున్నాడు. కృతజ్ఞత గా నాగేశ్వర్నాథ్ ఆలయాన్ని కుశుడు నిర్మించాడు.
నగరం లో ని ఇతర ప్రదేశాలు నాశనం అయిపోయినా చంద్రగుప్త విక్రమాదిత్య హయాం వరకు ఈ ఆలయం బాగానే ఉందని విశ్వాసం. 1750 లో సఫ్దర్ జంగ్ మినిస్టర్ అయిన నవాల్ రాయ్ చేత ఈ ఆలయం పునర్నిర్మితమయింది. శివరాత్రి పర్వదినాన ఈ ఆలయం లో జరిగే శివుడి ఊరేగింపు చూడడానికి ఎక్కువ మంది భక్తులు విచ్చేస్తారు.



Click it and Unblock the Notifications