పురావస్తు మ్యూజియం కూడా తప్పక చూడదగినదే. దీనిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1979 లో నిర్మించింది. దీనిలో అనేక శిల్పాలు, చెక్కడాలు, వారి అన్వేషణకు ఉపయోగించబడ్డాయి. అయితే, 1982 లో దీనిని స్ధానిక విశిష్ట శిల్పాల ప్రదర్శనా మ్యూజియంగా మార్చారు.
మ్యూజియం చూసేటపుడు మీరు లజ్జ గౌరి మూర్తులను కూడా చూడవచ్చు. ఇవి 6 నుండి 16 శతాబ్దాలకు చెందినవి. మ్యూజియంలో నాలుగు గ్యాలరీలుంటాయి. వీటిలో శివ, విష్ణు మూర్తుల వివిధ రూపాల శిల్పాలున్నాయి. గణపతి అనేక భంగిమలలో కనపడతాడు. అందమైన నంది విగ్రహం దానిపై శివుడు కూర్చొని వున్నట్లు మ్యూజియం ప్రవేశంలో కనపడుతుంది.
ఈ మ్యూజియంలో నాలుగు గ్యాలరీలుంటాయి. పురాతన రాతి ప్రదేశాన్ని గుర్తు చేస్తుంది. వరండా గ్యాలరీలో ఆకర్షణీయమైన ద్వార పాలకుల మూర్తులు, మరికొన్ని లిపులు కనపడతాయి.



Click it and Unblock the Notifications