1909 లో బెంగళూరులో స్థాపించబడిన భారత వైజ్ఞానిక సంస్థ దేశంలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటి. ఇట ఉత్తర బెంగళూరు లో ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంది.ఈ సంస్థ స్థాపన వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర వుంది. 1892 లో జంషెడ్జీ టాటా కి, స్వామి వివేకానంద కీ మధ్య జరిగిన ఒక యాతాలప సంభాషణలో దీన్ని స్థాపించాలన్న ఆలోచన పుట్టింది. 1909 లో మైసూర్ మహారాజా వారు దీనికి శంకుస్థాపన చేశారు.నలభై వేర్వేరు విభాగాలతో పని చేసే ఈ సంస్థలో ఆరు కాన్టీన్లు, జింఖానా, మంచి ఫుట్ బాల, క్రికెట్ మైదానాలు, హోటల్, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా అయిదు హాస్టళ్ళ తో సహా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా అనేక మౌలిక వసతులు వున్నాయి. దీనికి తోడూ, ఇదే ఆవరణలో ఉపాధ్యాయులకు, సిబ్బందికి, ఇంటి వసతి, గ్రంధాలయం, షాపింగ్ సెంటర్, మసాజ్ పార్లర్ల లాంటివి కూడా వున్నాయి. దేశీయ, విదేశీయ వృక్ష జాతుల సేకరణతో ఈ ఆవరణలో పచ్చదనం ఎల్లెడలా పరుచుకుని వుంటుంది. భవన నిర్మాణాలు శాస్త్రీయ శైలి లో వుంటాయి. ఈ విద్యాలయం అందించే డిగ్రీలు ప్రధానంగా రెండు రకాలు – ఒకటి పరిశోదన లో పి.హెచ్.డి, మరోటి ఎం.ఇ, ఎం.బి.ఏ లాంటి MS డిగ్రీలు.