ప్రపంచం లోని అతి పెద్ద ధ్యాన పిరమిడ్ వున్న ఈ పిరమిడ్ వాలీ వ్యక్తులకు, సంస్థలకు, ఆత్మ జ్ఞానం సాధించడానికి సహాయ పడుతోంది. రాజధాని కి దూరంగా కర్ణాటక లోని రామనగర్ జిల్లా కనకపురా తాలుకా లో దీన్ని బ్రహ్మర్షి పత్రిజీ 2003 లో స్థాపించారు.
కేవలం కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాల పైనే ఇక్కడికి చేరుకోవాలి. మొదట్లో మైత్రేయ బుద్దా విశ్వాలయం గా పిలవబడిన దీన్ని ఇప్పుడు పిరమిడ్ వాలీ అంటున్నారు. దీన్ని నిర్వహిస్తున్న భారతీయ సంస్థ పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థ పేరిట ఈ వాలీ ఏర్పడింది.ధ్యాన ప్రక్రియ ను విశ్వవ్యాప్తం చేస్తూ ధ్యాన కేంద్రంగాను, పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థల ఉద్యమానికి కీలక స్థావరం గా పని చేయాలన్నదే ఈ కేంద్రం ధ్యేయం. ఇక్కడ చందాలు అడిగేవారు గాని, ఏదైనా అమ్మే వారు గాని మీకు తారస పడరు. ఇక్కడి ప్రాధాన్యం అంటా ధ్యానం, శాంతి మీదనే వుంటుంది.
ఇక్కడి పరిశుభ్ర వాతావరణం అలా వుంటుంది. ఇక్కడ మీకు ఎలాంటి ఆటంకాలు లేని వాతావరణం అందుబాటులో వుండి – మీరు మీ శ్వాస పై ధ్యాస వుంచి ధ్యానం అనే పదానికి నిజమైన అర్థం కనుగోనేలా చేస్తుంది.