నగరానికి ఈశాన్యంలో ఎం జీ రోడ్డుకి దగ్గరలో ఉల్సూర్ చెరువు వుంది. బెంగళూరు ను స్థాపించిన కెంపె గౌడ దీన్ని నిర్మించాడు. సుమారు ఒకటిన్నర చదరపు కిలోమీటర్ల వైశాల్యం తో వుండే ఈ చెరువు లో అక్కడక్కడా దీవులు వుంటాయి. శ్రావణ భాద్రపదాల్లో ఇక్కడ వినాయక చవితి ఘనంగా జరుపుకుంటారు.
ఈత కోసం ఈత కొలను లాంటి అనేక వినోద కార్యక్రమాలకు ఒక ప్రత్యెక కాంప్లెక్స్ వుంది. ఉల్సూర్ చెరువుకి దగ్గరలో వున్న గురుద్వారా బెంగళూరు నగరం లోనే అతి పెద్దది.ఈ చెరువులో బోటు షికారు బాగా ప్రసిద్ది. ఇక్కడి బోటు క్లబ్బు చెరువులో తిరగడానికి, మధ్యలో వున్న దీవుల్లో ఆగడానికి బోట్లు సిద్ధం గా వుంచుతుంది.
మూడు కాల్వల ద్వారా నీరు చేరే ఈ చెరువు ఒకటిన్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వుంది. చెరువు పరిరక్షణ కోసం కఠిన నిబంధనలు చేశారు, పటిష్టమైన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.ఉల్సూర్ చెరువు నుంచి ఎం జీ రోడ్డు నడక దూరంలోనే వుంది. హలసూరు కి దగ్గరలో మెట్రో రైల్ కట్టే ప్రతిపాదన వుంది.