నగరానికి దక్షిణ భాగంలో ఉండే అబ్దుల్ రసూల్ దర్గాను అబ్దుల్లా పీర్ అని పిలుస్తారు. ప్రతి ఏటా భక్తులు ఇక్కడ ఎ౦తో వేడుకగా ‘ఉరుసు’ నిర్వహిస్తారు. బోహారా జాతి ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ వేడుకకు తరలివస్తారు. జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా తేలికగా చేరుకోవచ్చు.