బన్స్వారా జిల్లాలో ఎక్కువగా సందర్శించబడుతున్న అర్దునా పురావస్తు ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం.
11, 12 శతాబ్దాలలో నిర్మించిన అత్యద్భుతంగా తీర్చిదిద్దబడిన దేవాలయాల సముదాయం ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో బయల్పడిన అనేక దేవాలయాలు భారతదేశ వారసత్వ వైభవాన్ని తెలియచేస్తాయి. ఇక్కడ ఉన్న అసంఖ్యాకమైన దేవాలయాల వల్ల అర్దునా ను పాత, శిధిలమైన దేవాలయాల గ్రామంగా పిలుస్తారు. ఈ ప్రాంతం ప్రాచీన కాలంలో పార్మర్ రాజుల రాజధానిగా ఉండేది.