బారాబంకి జిల్లా లోని మహాదేవ టెంపుల్ అతి పురాతన శివాలయాలలో ఒకటి. దీనిలో అరుదైన శివ లింగం వుంటుంది. భక్తులు ఎంతో విశ్వాసంతో శివుడిని అర్చిస్తారు. ప్రసిద్ధ ఇతిహాసం మేరకు ఒక బ్రాహ్మణ పండితుడు లోదేరం అవస్తి అనే వాడు తన పొలంలో దొరికిన విగ్రహంతో అదే ప్రదేశంలో ఈ శివాలయాన్ని నిర్మించాడు. ఈ టెంపుల్ గురించి మహాభారతంలో కూడా పేర్కొనబడింది. మహా శివరాత్రి నాడు ఈ టెంపుల్ లో విశేష పూజలు రాత్రి అంతా నిర్వహిస్తారు.