భోపాల్ పర్యటనలో మరో కానుక బిర్లా మ్యూజియం, మధ్యప్రదేశ్ లోని సంస్కృతికి వారసత్వాన్ని గురించి ప్రపంచానికి తెలియచేయడానికి వీలుగా దీనిని నిర్మించారు. ఈ మ్యూజియంలో పర్యాటకులకు రాష్ట్ర చరిత్రకు చెందిన జ్ఞానాన్ని తెలియచేసే అనేక కళలు, కళాఖండాలు ఉన్నాయి.
అలాగే భోపాల్ లోని ఈ మ్యూజియం ఒక విధమైన, ప్రధాన పర్యాటక ప్రదేశం. ఈ మ్యూజియం ఆదిమ కాలానికి చెందిన, ఆతరువాతి మధ్యప్రదేశ్ చరిత్రకు చెందిన అనేక వస్తువులను ప్రదర్శిస్తుంది. చరిత్ర ప్రేమికులు పాతశిలాయుగం, నవీనశిలాయుగానికి చెందిన అనేక పరికరాలను చూసి ఆశ్చర్యపోతారు.
ఇక్కడ 7వ,13 వ శతాబ్దాల మధ్య కాలంనాటి అనేక రాతిశిల్పలు కూడా ప్రదర్శించబడతాయి. బహుశ 2వ శతాబ్దానికి చెందిన నాణాలు, వ్రాతప్రతులు కూడా ప్రదర్శించబడ్డాయి. ఈ మ్యూజియంలో ఇంకా, సందర్శకులు విస్మయం చెందకుండా ఉండలేని అద్భుతమైన స్కేల్ మోడల్ లో ఉన్న భీమ్ బెట్క రాతి ఆశ్రమం ఉంది.