ఆది బ్రహ్మ ఆలయం, హిందువుల సృష్టికర్త బ్రహ్మదేవునికి చెందిన భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం ఖోఖాన్ గ్రామంలో భు౦టర్ కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం నాణ్యమైన కలపతో తయారుచేయబడి, దేవాలయం మధ్యలో ముద్రలు లేదా స్మారక ముసుగులతో కూడిన రథంతో బాటుగా బ్రహ్మ దేవుని విగ్రహం ఉంది. ఈ ముద్రలు కాంస్యం, వెండి, ఎనిమిది లోహాల కలయిక అష్టధాతుతో తయారుచేయబడ్డాయి. ఈ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది. నాలుగు పైకప్పులతో, ఈ ఆలయం పగోడా నిర్మాణ శైలిలో ఉంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి పురాణాలకు సంబంధించిన కధనాలను తెలియచేసే చెక్కడాలు ఉన్నాయి.
ఈ ఆలయానికి ఇరువైపులా గర్ జోగిని, మనికరణ్ జోగిని ఆలయాలు కూడా ఉన్నాయి. గతంలో, ఈ ఆలయానికి సమీపంలో ఒక సహజ నీటి బుగ్గ ప్రవహించేది, ఇపుడది ఎండిపోయింది. నాగ్ని బిర్షు, ఖోఖాన్, మొహల్, భులాంగ్ బిర్షు వంటి కొన్ని పండుగలు ఇక్కడ జరుపుకుంటారు.