రెమున, బాలేశ్వర్ జిల్లాలో నివశించే స్థానికులందరికీ ఒక యాత్రాస్థలం. ఇది చండిపూర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ, అత్యంత గౌరవి౦చబడే గోపీనాథ్ ఉండే ఈ ఆలయాన్ని ఖీర్చోర గోపీనాథ్ ఆలయం అంటారు. శతాబ్దాల కిందటి ఈ ఆలయాన్ని శ్రీ చైతన్య మహాప్రభు తన మార్గదర్శి మాధవేంద్ర పురి తో కలిసి దర్శించారని నమ్ముతారు. ఇక్కడి దేవుడికి ప్రత్యేకంగా తయారుచేయబడిన ఖీర్ అనే వంటకాన్ని నివేదిస్తారు, దీనినే ఈ ఆలయ కమిటీ వారు ప్రసాదంగా అమ్ముతారు.
రెమున లో జన్మాష్టమి, చందన్ పూర్ణిమ నిర్వహిస్తారు. రెమున సందర్శించేవారు ఈ ప్రాంత ప్రత్యేకత అయిన అప్లిక్ వర్క్ లు, ఇత్తడి, కాంస్యం తో చేసిన పాత్రలు కొనడం మర్చిపోవద్దు. సమీప ప్రదేశాలలో అనేక ఇతర ఆలయాలు, మఠాలు కూడా ఉన్నాయి. రామచండి ఆలయం, గార్గేశ్వర్ ఆలయం, మాధవేంద్ర మఠం, గౌడియ మఠం ఇతరవాటితో ఉన్నాయి.



Click it and Unblock the Notifications